స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ‘పుష్ప’ సినిమా సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరగనుంది. వీలైనంత త్వరగా పార్ట్ 2ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి పార్ట్ 2 కంటే ముందుగా బన్నీ మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ లుక్ ని మార్చుకోవాల్సి వస్తుందని.. ఆ ఆలోచన పక్కన పెట్టేశారు. అయితే ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత బన్నీ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదొక పీరియాడిక డ్రామా అని తెలుస్తోంది. ఇండియాకు స్వాతంత్య్రం రాకముందు కాలానికి చెందిన కథ ఇది. ఈ కాన్సెప్ట్ బన్నీకి బాగా నచ్చిందట. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ పూర్తయిన వెంటనే.. బన్నీ గ్యాప్ తీసుకోకుండా బోయపాటి సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా అని సమాచారం. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది.
This post was last modified on December 18, 2021 2:58 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…