స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ‘పుష్ప’ సినిమా సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరగనుంది. వీలైనంత త్వరగా పార్ట్ 2ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి పార్ట్ 2 కంటే ముందుగా బన్నీ మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ లుక్ ని మార్చుకోవాల్సి వస్తుందని.. ఆ ఆలోచన పక్కన పెట్టేశారు. అయితే ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత బన్నీ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదొక పీరియాడిక డ్రామా అని తెలుస్తోంది. ఇండియాకు స్వాతంత్య్రం రాకముందు కాలానికి చెందిన కథ ఇది. ఈ కాన్సెప్ట్ బన్నీకి బాగా నచ్చిందట. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ పూర్తయిన వెంటనే.. బన్నీ గ్యాప్ తీసుకోకుండా బోయపాటి సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా అని సమాచారం. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది.
This post was last modified on December 18, 2021 2:58 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…