స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ‘పుష్ప’ సినిమా సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరగనుంది. వీలైనంత త్వరగా పార్ట్ 2ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి పార్ట్ 2 కంటే ముందుగా బన్నీ మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ లుక్ ని మార్చుకోవాల్సి వస్తుందని.. ఆ ఆలోచన పక్కన పెట్టేశారు. అయితే ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత బన్నీ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదొక పీరియాడిక డ్రామా అని తెలుస్తోంది. ఇండియాకు స్వాతంత్య్రం రాకముందు కాలానికి చెందిన కథ ఇది. ఈ కాన్సెప్ట్ బన్నీకి బాగా నచ్చిందట. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్ పూర్తయిన వెంటనే.. బన్నీ గ్యాప్ తీసుకోకుండా బోయపాటి సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా అని సమాచారం. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది.
This post was last modified on December 18, 2021 2:58 pm
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…