మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు స్టార్ హీరోలున్నారు. ఆ తర్వాత స్టార్లున్నారు. కానీ ఇండస్ట్రీలో ఎక్కువమందికి ఎవరు స్ఫూర్తి అంటే మాత్రం చిరు పేరే చెబుతారు. కొత్తగా సినిమాల్లోకి వస్తున్న ఈ తరం వాళ్లు కూడా తమకు మెగాస్టారే స్ఫూర్తి అంటారు.
అతి సామాన్య నేపథ్యం నుంచి వచ్చి మొదట్లో చిన్న పాత్రలు చేసి.. ఆ తర్వాత అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ.. కష్టపడి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన వైనం ఎవరికైనా స్ఫూర్తిదాయకమే. అంతే కాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం.. ఎప్పుడూ నిర్మాతల శ్రేయస్సు కోరుకోవడం చిరును ప్రత్యేకంగా నిలబెట్టే విషయాలు. ఆయన గొప్ప మనసు గురించి ఇండస్ట్రీ జనాలు కథలు కథలుగా చెబుతారు.
చిరులోని అత్యంత గొప్ప లక్షణం.. ఈ తరం స్టార్లు నేర్చుకోవాల్సిన విషయం.. ఆయన సినిమా పూర్తయ్యాక కానీ పారితోషకం తీసుకోకపోవడం. కెరీర్ ఆరంభం నుంచి చిరుకు సినిమా మొదలయ్యే ముందు అడ్వాన్స్ తీసుకునే అలవాటు లేదు. సినిమా అంతా అయ్యాకే పారితోషకం తీసుకుంటాడు. ఈ విషయంలో ఒక సందర్భంలో బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర.. చిరును హెచ్చరించాడట.
సినిమా పూర్తయ్యాక నిర్మాతలు చేతులెత్తేస్తే పరిస్థితి ఏంటని.. అడ్వాన్స్ తీసుకోమని అన్నాడట. కానీ చిరు ఆ మాటను పట్టించుకోకుండా సినిమా పూర్తయ్యాకే పారితోషకం తీసుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఆనవాయితీని తన కొడుకు రామ్ చరణ్ కూడా కొనసాగిస్తున్నాడని.. ఈ తరంలో ఇంకెవరైనా అలా చేస్తున్నారో లేదో తనకు తెలియదని చిరు అన్నాడు. ఇక తన కెరీర్లో తాను చూసిన అత్యుత్తమ నిర్మాతల్లో చరణ్ ఒకడనిఈ ఇంటర్వ్యూలో చిరు కితాబివ్వడం విశేషం.
This post was last modified on April 17, 2020 5:23 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…