దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే యాక్షన్ ఎపిసోడ్లు లేకుండానే వందల కోట్లు ఎలా కొల్లగొట్టవచ్చో దర్శకుడు ఆదిత్య ధార్ నిరూపించాక గతంలో వచ్చిన టైగర్, వార్ లాంటి ఫ్రాంచైజీలు తక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయి.
వీటి సంగతి అలా ఉంచితే యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతున్న అల్ఫా గత డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యంతో పాటు విఎఫెక్స్ తదితర కారణాల వల్ల ఏప్రిల్ కు వాయిదా వేశారు. తాజాగా ముంబై వర్గాల్లో వినిపిస్తున్న పుకారు సినీ ప్రియులు నమ్మశక్యంగా లేదనేలా ఉంది.
దాని ప్రకారం అల్ఫాని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ 215 కోట్ల ఆఫర్ ఇస్తే నిర్మాత ఆదిత్య చోప్రా వద్దని చెప్పారట. నిజానికి అల్ఫా బడ్జెట్ కూడా అంత అయ్యుండదు. కారణం ఏంటంటే అల్ఫాలో థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ బోలెడు ఉందట.
అందులోనూ అలియా భట్ లాంటి టాప్ పర్ఫార్మార్, వామికా గబ్బి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ఇలాంటి ఆలోచన చేయమని ఆదిత్య చోప్రా తేల్చి చెప్పారట. ఇది నిజమో కాదో కానీ విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ది రైల్వే మెన్ తీసిన శివ్ రవైల్ ఈ అల్ఫాకు దర్శకుడు కావడం నెట్ ఫ్లిక్స్ ఆఫర్ కు కారణం కావొచ్చని ఒక టాక్.
బాబీ డియోల్ విలన్ గా నటించిన అల్ఫా ఇద్దరు లేడీ గూఢచారుల సాహసాల నేపథ్యంలో సాగుతుంది. తొలుత సల్మాన్ ఖాన్, షారుఖ్, హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఇద్దరితో క్యామియోలు చేయించాలని చూసినప్పటికీ ప్రస్తుతం అది జరగడం అనుమానమే అంటున్నారు.
సల్మాన్ ఒక్కడే సానుకూలంగా ఉండటంతో ఏం చేయాలనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని వినికిడి. యష్ రాజ్ స్పై యునివర్స్ పేరుతో ఒక సినిమాటిక్ ప్రపంచాన్ని సృష్టించాలని చూస్తున్న ఆదిత్య చోప్రాకు టైగర్ 3 ఫలితం, వార్ 2 డిజాస్టర్ పెద్ద షాక్ ఇచ్చాయి. మరి అల్ఫా అయినా హిట్ అందుకుని ఆయనకు ఊరట కలిగిస్తుందో లేదో చూడాలి.
This post was last modified on February 23, 2026 7:37 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…