ముందు ప్రకటించిన ప్రకారమైతే అడివి శేష్ డెకాయిట్ మార్చి 19 విడుదల కావాలి. కానీ అదే రోజు దురంధర్ 2, టాక్సిక్ ఉన్న నేపథ్యంలో ఇది వాయిదా పడితే బాగుంటుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమయ్యింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ సంస్థ ఎలాంటి పబ్లిసిటీ చేయకుండా మౌనంగా ఉంది. వచ్చే వారం మొదటి ఆడియో సింగల్ వదలబోతున్నారు.
ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ లో ఎక్కడా రిలీజ్ డేట్ లేదు. అంటే మనసు మార్చుకున్నట్టే. ఒక కన్నడ, ఒక హిందీ సినిమాలకు భయపడి తెలుగు మూవీ వెనుకడుగు వేయడం ఏమిటనే డౌట్ రావొచ్చు కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా చూడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
దురంధర్ 2, టాక్సిక్ ఈ రెండు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతున్నారు. ఒక్క ఇండియాలోనే రెండు కలిపి సుమారు తొమ్మిది వేలకు పైగా స్క్రీన్లలో రాబోతున్నట్టు సమాచారం. ఈ నెంబర్ ఇంకా పెరగనుంది. ఆల్రెడీ అగ్రిమెంట్లు కూడా మొదలైపోయాయి.
ప్రతి భాషలో బడా డిస్ట్రిబ్యూటర్లు అండగా నిలవడంతో పెద్ద ఎత్తున థియేటర్లను బ్లాక్ చేసుకుంటున్నారు. మూడోది వస్తే అనవసరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. డెకాయిట్ లో కంటెంట్ ఎంత బాగా వచ్చినా ఉత్తరాది మార్కెట్ లో తగినన్ని స్క్రీన్లు దొరక్కపోతే ఆడియన్స్ కి రీచ్ కాదు. మొత్తం రణ్వీర్ సింగ్, యష్ కలిసి తినేస్తారు.
అందుకే డెకాయిట్ వెనుక అడుగు వేస్తే మంచి నిర్ణయం అవుతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు షానియేల్ డియో దర్శకత్వం వహించాడు. భీమ్స సంగీతం సమకూరుస్తున్నారు. టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది.
నాగార్జున పాటను రీమిక్స్ చేసుకుని దాన్ని వాడుకున్న విధానం సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు వదలబోయే లవ్ సాంగ్ కూడా మంచి మెలోడీతో ఉంటుందట. దొంగగా మారిన ఒక వ్యక్తి పోలీసులు, ప్రభుత్వాన్ని ఎలా ముప్పతిప్పలు పెట్టాడనే పాయింట్ మీద డెకాయిట్ రూపొందింది. అడివి శేష్ ఏకంగా దీని కోసమే మూడు సంవత్సరాలు ఖర్చు పెట్టాడు.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…