ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం కొన్ని నెలలుగా ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ముందుగా తమ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టే క్రమంలో జగన్ సర్కారు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సందర్భంగా టికెట్ల ధరలపై నియంత్రణ తెచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఒక రకంగా ఆ సినిమాకు ఇబ్బందులు కలిగించబోయి తేనె తుట్టెను కదిపినట్లే అయింది. తర్వాత ఈ వ్యవహారం మొత్తం ఇండస్ట్రీకే శాపంగా మారింది.
ఇప్పుడు ప్రతి సినిమా బిజినెస్లో దాదాపు 20 శాతం దెబ్బ తినే పరిస్థితి వచ్చింది. వసూళ్లు తగ్గుతున్నాయి. అందుకు తగ్గట్లే బిజినెస్ తగ్గుతోంది. జగన్ సర్కారు మనసు మార్చడానికి ఇండస్ట్రీ పెద్దలు ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడటంతో సమస్య మరింత జఠిలమైంది. ఐతే ప్రభుత్వం ఎంతకీ మెట్టు దిగకపోవడంతో ఇక నిర్మాతలో, డిస్ట్రిబ్యూటర్లో, లేదంటే ఎగ్జిబిటర్లో కోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. చివరికి ఎగ్జిబిటర్లే ఆ పని చేశారు. కోర్టు టికెట్ల ధరలను నియంత్రిస్తూ ఇచ్చిన జీవోపై కోర్టు స్టే విధించింది.
దీంతో ఇండస్ట్రీ జనాలు హమ్మయ్య అనుకున్నారు. కానీ జగన్ పంతం ఎలాంటిదో తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన కానీ, మంత్రులు కానీ తేలిగ్గా వదిలే అవకాశమే లేదు. అందుకే దీనిపై అప్పీల్కు ప్రభుత్వం సిద్ధమైంది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా టికెట్ల ధరలను పెంచడానికి వీల్లేదంటూ ఏపీలో స్థానికంగా అధికారులు ఆదేశాలు జారీ చేస్తుండటం గమనార్హం.
ఒకవేళ సుప్రీం కోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినా.. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ నిర్ణయాన్ని ధిక్కరించారన్న కోపంతో కొవిడ్ పేరు చెప్పి థియేటర్లలో మళ్లీ 50 పర్సంట్ ఆక్యుపెన్సీ తేవడం, కర్ఫ్యూ పేరుతో నైట్ షోలు రద్దు చేయడం.. లేదంటే థియేటర్ల మీద దాడులు చేయడం లాంటివి జగన్ సర్కారు చేయొచ్చనే అభిప్రాయాలు ఇండస్ట్రీ జనాల చర్చల్లో వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on December 15, 2021 10:43 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…