Movie News

‘పుష్ప’ టిక్కెట్టు.. ప్లస్సా మైనస్సా?

పెద్ద హీరోలు నటించిన భారీ సినిమాలు రిలీజైనపుడు తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం టికెట్ల రేట్లు పెంచుకోవడం, అదనపు షోలు వేసుకోవడం కొన్నేళ్లుగా నడుస్తున్న సంప్రదాయమే. ఐతే ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య అందుకు అవకాశం ఉండట్లేదు. ఉన్న రేట్లు కూడా కొనసాగించకుండా చాలా ఏళ్ల కిందటి ధరల్ని అమలు చేస్తుండటంతో నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారు.

ఐతే తెలంగాణలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ రేట్టను మునుపటి కంటే ఎక్కువ స్థాయిలో పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చేశారు. గతంలో మల్టీప్లెక్సుల్లో రూ.150 ఉన్న స్క్రీన్లలో ధరల్ని రూ.200కు పెంచి అమ్మేవారు. రూ.200 ఉంటే రూ.250 చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ‘పుష్ప’ సినిమాకు ఒకేసారి 150 నుంచి 250కి రేట్లు పెంచేశారు. సింగిల్ స్క్రీన్లలో రూ.120 ఉన్న టికెట్ రూ.200కు చేరుకుంది. మరీ ఈ స్థాయిలో రేట్లను పెంచేయడం పట్ల ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

‘పుష్ప’ సినిమాపై భారీ అంచనాలున్న మాట వాస్తవం. టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని చూసుకుని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరీ అత్యాశకు పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో రేట్లు తక్కువ ఉండటం వల్ల పడుతున్న గండిని ఇక్కడ పూడ్చుకుంటున్నట్లుగా ఉందని.. ఇది చూసి ఏపీలో టికెట్ల ధరలపై నియంత్రణ తేవడంలో తప్పేమీ లేదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. అసలు ఈ స్థాయిలో ధరలు పెంచడం ‘పుష్ప’కు ప్లస్సా మైనస్సా అన్నది కూడా చూడాలి.

ఈ ధరలు చూసి కొంత మేర ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి వెనుకంజ వేస్తారు. సినిమాకు మంచి టాక్ వస్తే ఓకే కానీ.. డివైడ్ టాక్ వస్తే మాత్రం ఈ ధరలు ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తాయి. ఓటీటీల్లో వచ్చాక చూసుకుందాం.. రెండో వారం వరకు వేచి చూద్దాం అనుకుంటారు. కానీ ఆలోపు పైరసీ వెర్షన్లు వచ్చేస్తుంటాయి. థియేటర్లలోకి కొత్త సినిమాలు దిగుతాయి. ఇలా ధరలు పెంచడం వల్ల దెబ్బ తిన్న సినిమాలు కూడా లేకపోలేదు. మరి ‘పుష్ప’ మీద ఈ టికెట్ల రేట్ల పెంపు ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

This post was last modified on December 14, 2021 7:40 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ భ‌లే సినిమా

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మ‌హాన‌టి త‌ర్వాత…

43 minutes ago

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

3 hours ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

5 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

6 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

7 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

7 hours ago