ప్రభాస్ చేతిలో ఉన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్-కె’ ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్లతో కలిసి ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లింది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్లో తెరకెక్కబోతున్న చిత్రంగా చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రి ప్రొడక్షన్ చేశారంటే ఈ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు.
ఇలాంటి మెగా ప్రాజెక్టుకు దానికి స్థాయిలోనే టెక్నీషియన్లను తీసుకుంటారని అనుకున్నారు. ఐతే ‘ప్రాజెక్ట్-కె’కు సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మిక్కీ ప్రతిభను తక్కువ చేయడం కాదు కానీ.. అతను ఈ స్థాయి భారీ చిత్రాలకు ఇప్పటిదాకా పని చేసింది. లేదు. ఈ రేంజ్ అనే కాదు.. ఇప్పటిదాకా పెద్ద హీరోల సినిమాలకే వర్క్ చేయలేదు.
ఐతే ‘మహానటి’కి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించి సినిమాకు ప్రాణం పోయడంతో మిక్కీ మీద నమ్మకంతో నాగ్ అశ్విన్.. అతణ్ని ‘ప్రాజెక్ట్-కె’ కోసం ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఐతే తర్వాత చిత్ర బృందం ఆలోచన మారిందని.. ఇలాంటి భారీ సినిమా స్థాయికి తగ్గట్లు పెద్ద సంగీత దర్శకుడిని ఎంచుకోవాలని చూస్తున్నారని.. మిక్కీని తప్పిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారం నిజం కాదని తేలింది. తన సంగీత దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన మిక్కీ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ‘ప్రాజెక్ట్-కె’ను పేర్కొన్నాడు.
ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. ఐతే ఈ సినిమా సంగీత చర్చలు ఇంకా మొదలు కాలేదని వెల్లడించాడు. కాబట్టి మిక్కీనే ఈ మెగా మూవీకి సంగీత దర్శకుడిగా కొనసాగబోతున్నాడన్నమాట. ‘మహానటి’కి పని చేసిన స్పానిష్ సినిమాటోగ్రాఫర్ డానీ సాంచెజ్యే ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరాను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 14, 2021 6:18 pm
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…