Movie News

ప్రభాస్ – అశ్విన్ సినిమాలో అతనున్నాడు

ప్రభాస్ చేతిలో ఉన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్-కె’ ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్‌లతో కలిసి ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లింది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్లో తెరకెక్కబోతున్న చిత్రంగా చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రి ప్రొడక్షన్ చేశారంటే ఈ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు.

ఇలాంటి మెగా ప్రాజెక్టుకు దానికి స్థాయిలోనే టెక్నీషియన్లను తీసుకుంటారని అనుకున్నారు. ఐతే ‘ప్రాజెక్ట్-కె’కు సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్‌ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మిక్కీ ప్రతిభను తక్కువ చేయడం కాదు కానీ.. అతను ఈ స్థాయి భారీ చిత్రాలకు ఇప్పటిదాకా పని చేసింది. లేదు. ఈ రేంజ్ అనే కాదు.. ఇప్పటిదాకా పెద్ద హీరోల సినిమాలకే వర్క్ చేయలేదు.

ఐతే ‘మహానటి’కి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించి సినిమాకు ప్రాణం పోయడంతో మిక్కీ మీద నమ్మకంతో నాగ్ అశ్విన్.. అతణ్ని ‘ప్రాజెక్ట్-కె’ కోసం ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఐతే తర్వాత చిత్ర బృందం ఆలోచన మారిందని.. ఇలాంటి భారీ సినిమా స్థాయికి తగ్గట్లు పెద్ద సంగీత దర్శకుడిని ఎంచుకోవాలని చూస్తున్నారని.. మిక్కీని తప్పిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారం నిజం కాదని తేలింది. తన సంగీత దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన మిక్కీ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ‘ప్రాజెక్ట్-కె’ను పేర్కొన్నాడు.

ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. ఐతే ఈ సినిమా సంగీత చర్చలు ఇంకా మొదలు కాలేదని వెల్లడించాడు. కాబట్టి మిక్కీనే ఈ మెగా మూవీకి సంగీత దర్శకుడిగా కొనసాగబోతున్నాడన్నమాట. ‘మహానటి’కి పని చేసిన స్పానిష్ సినిమాటోగ్రాఫర్ డానీ సాంచెజ్‌యే ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరాను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on December 14, 2021 6:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

3 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

40 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

1 hour ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago