ప్రభాస్ చేతిలో ఉన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్-కె’ ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్లతో కలిసి ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదికి వెళ్లింది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్లో తెరకెక్కబోతున్న చిత్రంగా చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రి ప్రొడక్షన్ చేశారంటే ఈ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు.
ఇలాంటి మెగా ప్రాజెక్టుకు దానికి స్థాయిలోనే టెక్నీషియన్లను తీసుకుంటారని అనుకున్నారు. ఐతే ‘ప్రాజెక్ట్-కె’కు సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మిక్కీ ప్రతిభను తక్కువ చేయడం కాదు కానీ.. అతను ఈ స్థాయి భారీ చిత్రాలకు ఇప్పటిదాకా పని చేసింది. లేదు. ఈ రేంజ్ అనే కాదు.. ఇప్పటిదాకా పెద్ద హీరోల సినిమాలకే వర్క్ చేయలేదు.
ఐతే ‘మహానటి’కి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించి సినిమాకు ప్రాణం పోయడంతో మిక్కీ మీద నమ్మకంతో నాగ్ అశ్విన్.. అతణ్ని ‘ప్రాజెక్ట్-కె’ కోసం ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఐతే తర్వాత చిత్ర బృందం ఆలోచన మారిందని.. ఇలాంటి భారీ సినిమా స్థాయికి తగ్గట్లు పెద్ద సంగీత దర్శకుడిని ఎంచుకోవాలని చూస్తున్నారని.. మిక్కీని తప్పిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారం నిజం కాదని తేలింది. తన సంగీత దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన మిక్కీ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ‘ప్రాజెక్ట్-కె’ను పేర్కొన్నాడు.
ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని.. ఐతే ఈ సినిమా సంగీత చర్చలు ఇంకా మొదలు కాలేదని వెల్లడించాడు. కాబట్టి మిక్కీనే ఈ మెగా మూవీకి సంగీత దర్శకుడిగా కొనసాగబోతున్నాడన్నమాట. ‘మహానటి’కి పని చేసిన స్పానిష్ సినిమాటోగ్రాఫర్ డానీ సాంచెజ్యే ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరాను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 14, 2021 6:18 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…