Movie News

ధనుష్.. నాగ్.. మళ్ళీ మొదలవుతుంది?

ఏడాది కిందట అక్కినేని నాగార్జున.. తమిళ నటుడు ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ భారీ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించడం.. ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలవడం తెలిసిన సంగతే. ఐతే ఆ సినిమాకు అనుకోకుండా బ్రేక్ పడింది.

ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి ధనుష్ ప్రణాళికలు వేసుకోగా.. నిర్మాణ సంస్థకు ఆర్థిక సమస్యలు తలెత్తి వెనక్కి తగ్గింది. దీంతో సినిమా ఆగిపోయింది. దీంతో ధనుష్ ఈ సినిమాను పక్కన పెట్టేసి హీరోగా చేస్తున్న సినిమాల మీదే దృష్టిపెట్టాడు. ‘రుద్ర’ పేరుతో తెరకెక్కాల్సిన ఆ సినిమా చరిత్రలో కలిసిపోయిందనే అనుకున్నారంతా. కానీ ధనుష్ ఆ ప్రాజెక్టుపై ఆశలు వదులుకోలేదు. లాక్ డౌన్ టైంలో ఆ స్క్రిప్టు మీద పని చేసి.. కొంచెం బడ్జెట్ తగ్గించి ప్లాన్స్ వేసి.. వేరే నిర్మాతల్ని ఒప్పించి సినిమాను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేశాడు.

షూటింగ్స్ పున:ప్రారంభమై సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ‘రుద్ర’ చిత్రాన్ని ధనుష్ పున:ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ముందు అతను హీరోగా నటిస్తున్న ‘కర్ణన్’ అనే సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న ‘జగమే తంత్రం’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘రుద్ర’ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా. దీని కాస్టింగ్ పెద్దదే. నాగ్‌తో పాటు అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, ఎస్జే సూర్య, శరత్ కుమార్, అను ఇమ్మాన్యుయెల్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.

నాగ్ చేయాల్సిన పాత్రకు ముందు రజనీకాంత్‌ను అనుకున్నాడు ధనుష్. ఆయన ఈ సినిమా చేసే అవకాశం లేకపోవడంతో నాగ్ వైపు చూశాడు. ఇంతకుముందు ధనుష్ ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా చక్కటి విజయం సాధించింది. ఈసారి ధనుష్ పెద్ద ప్రాజెక్టునే తలకెత్తుకున్నాడు.

This post was last modified on June 8, 2020 9:41 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సమీక్ష – ఆ ఒక్కటి అడక్కు

గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…

15 mins ago

మీనమేషాలు లెక్కబెడుతున్న భారతీయుడు 2

లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…

24 mins ago

వివేకా కేసులో సంచ‌ల‌నం.. అవినాష్‌కు ఊర‌ట‌

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డికేసులో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…

2 hours ago

రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ !

లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…

2 hours ago

ముద్రగ‌డ ఫ్యామిలీలో క‌ల్లోలం.. ప‌వ‌న్‌కు జైకొట్టిన కుమార్తె

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్తితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న…

2 hours ago

అందమైన దెయ్యాలను పట్టించుకోవడం లేదే

ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…

3 hours ago