Movie News

ధనుష్.. నాగ్.. మళ్ళీ మొదలవుతుంది?

ఏడాది కిందట అక్కినేని నాగార్జున.. తమిళ నటుడు ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ భారీ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి అంగీకరించడం.. ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలవడం తెలిసిన సంగతే. ఐతే ఆ సినిమాకు అనుకోకుండా బ్రేక్ పడింది.

ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి ధనుష్ ప్రణాళికలు వేసుకోగా.. నిర్మాణ సంస్థకు ఆర్థిక సమస్యలు తలెత్తి వెనక్కి తగ్గింది. దీంతో సినిమా ఆగిపోయింది. దీంతో ధనుష్ ఈ సినిమాను పక్కన పెట్టేసి హీరోగా చేస్తున్న సినిమాల మీదే దృష్టిపెట్టాడు. ‘రుద్ర’ పేరుతో తెరకెక్కాల్సిన ఆ సినిమా చరిత్రలో కలిసిపోయిందనే అనుకున్నారంతా. కానీ ధనుష్ ఆ ప్రాజెక్టుపై ఆశలు వదులుకోలేదు. లాక్ డౌన్ టైంలో ఆ స్క్రిప్టు మీద పని చేసి.. కొంచెం బడ్జెట్ తగ్గించి ప్లాన్స్ వేసి.. వేరే నిర్మాతల్ని ఒప్పించి సినిమాను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేశాడు.

షూటింగ్స్ పున:ప్రారంభమై సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ‘రుద్ర’ చిత్రాన్ని ధనుష్ పున:ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ముందు అతను హీరోగా నటిస్తున్న ‘కర్ణన్’ అనే సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న ‘జగమే తంత్రం’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘రుద్ర’ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా. దీని కాస్టింగ్ పెద్దదే. నాగ్‌తో పాటు అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, ఎస్జే సూర్య, శరత్ కుమార్, అను ఇమ్మాన్యుయెల్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.

నాగ్ చేయాల్సిన పాత్రకు ముందు రజనీకాంత్‌ను అనుకున్నాడు ధనుష్. ఆయన ఈ సినిమా చేసే అవకాశం లేకపోవడంతో నాగ్ వైపు చూశాడు. ఇంతకుముందు ధనుష్ ‘పవర్ పాండి’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా చక్కటి విజయం సాధించింది. ఈసారి ధనుష్ పెద్ద ప్రాజెక్టునే తలకెత్తుకున్నాడు.

This post was last modified on June 8, 2020 9:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

3 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

5 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

6 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

8 hours ago

వార్ ఎఫెక్ట్: ఇక హైదరాబాద్ వంతు!

అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…

9 hours ago

బ్యాండ్ మ్రోగిస్తున్న మేళం సరిపోవడం లేదా

నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…

9 hours ago