రెండు రోజుల కిందటే ‘పుష్ప’ మూవీ నుంచి ‘ఊ అంటావా ఉఊ అంటావా మావా’ అంటూ ఒక పాటను లాంచ్ చేశారు. ఇక అప్పట్నుంచి సోషల్ మీడియాలో ఈ పాట మోతెక్కిపోతోంది. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనే టైటిల్తో పాటను రిలీజ్ చేయగా.. ఆ ట్యాగ్కు తగ్గట్లే ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలో 1.4 కోట్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్తో ఈ పాట యూట్యూబ్ను షేక్ చేసేసింది.
సౌత్ ఇండియాలో 24 గంటల వ్యవధిలో అత్యధిక మంది వీక్షించిన పాటగా ఇది రికార్డ్ సృష్టించింది. ‘పుష్ప’ మీద ఉన్న అంచనాలకు తోడు సమంతతో ఐటెం సాంగ్ అనేసరికి ఈ పాటపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్న మాట వాస్తవం. అలాగే సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఐటెం సాంగ్ మీద అంచనాలు భారీగానే ఉంటాయి. ఇక వీరికి బన్నీ కూడా తోడయ్యాడు. కాబట్టి ఈ పాట రిలీజ్కు ముందే హైప్ వచ్చింది.
కానీ అంచనాలను మించిపోయి ఈ రేంజిలో పాటకు రెస్పాన్స్ వస్తుందని.. సోషల్ మీడియాను ఇంతలా ఈ పాట షేక్ చేస్తుందని ఊహించలేదు. అలాగని ఈ పాట విషయంలో విమర్శలు లేవా అంటే అలా ఏమీ కాదు. సుక్కు-దేవి సినిమాల్లో ఇంతకుముందు వచ్చిన పాటల స్థాయిలో ఇందులో ఊపు లేదని కొందరంటుంటే.. సాహిత్యం మరీ శ్రుతి మించిందని.. ఒక బూతు పాటలా ఉందని ఇంకొందరంటున్నారు. సమంత విషయంలోనూ మిశ్రమ స్పందన వచ్చింది.
విడాకుల తర్వాత ఈ పాటలో కొంచెం హద్దులు దాటి ఎక్స్పోజింగ్ చేయడం పట్ల విమర్శలూ వచ్చాయి. మరోవైపు ఈ పాట ‘వీడొక్కడే’ సినిమాలోని ‘హనీ హనీ’ పాటకు కాపీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఐతే ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఈ పాట ఒక సెన్సేషన్ అనడంలో సందేహం లేదు. ఆల్రెడీ ‘ఊ అంటావా ఉఊ అంటావా మావా’ అనే హుక్ లైన్ జనాల నోళ్లలో బాగా నానుతోంది. పాటను మళ్లీ మళ్లీ వింటున్నారు. చూస్తున్నారు. రేప్పొద్దున సినిమా రిలీజయ్యాక ఈ పాట మరింత ఊపేయడం ఖాయం.
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…