రెండు రోజుల కిందటే ‘పుష్ప’ మూవీ నుంచి ‘ఊ అంటావా ఉఊ అంటావా మావా’ అంటూ ఒక పాటను లాంచ్ చేశారు. ఇక అప్పట్నుంచి సోషల్ మీడియాలో ఈ పాట మోతెక్కిపోతోంది. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనే టైటిల్తో పాటను రిలీజ్ చేయగా.. ఆ ట్యాగ్కు తగ్గట్లే ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలో 1.4 కోట్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్తో ఈ పాట యూట్యూబ్ను షేక్ చేసేసింది.
సౌత్ ఇండియాలో 24 గంటల వ్యవధిలో అత్యధిక మంది వీక్షించిన పాటగా ఇది రికార్డ్ సృష్టించింది. ‘పుష్ప’ మీద ఉన్న అంచనాలకు తోడు సమంతతో ఐటెం సాంగ్ అనేసరికి ఈ పాటపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్న మాట వాస్తవం. అలాగే సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఐటెం సాంగ్ మీద అంచనాలు భారీగానే ఉంటాయి. ఇక వీరికి బన్నీ కూడా తోడయ్యాడు. కాబట్టి ఈ పాట రిలీజ్కు ముందే హైప్ వచ్చింది.
కానీ అంచనాలను మించిపోయి ఈ రేంజిలో పాటకు రెస్పాన్స్ వస్తుందని.. సోషల్ మీడియాను ఇంతలా ఈ పాట షేక్ చేస్తుందని ఊహించలేదు. అలాగని ఈ పాట విషయంలో విమర్శలు లేవా అంటే అలా ఏమీ కాదు. సుక్కు-దేవి సినిమాల్లో ఇంతకుముందు వచ్చిన పాటల స్థాయిలో ఇందులో ఊపు లేదని కొందరంటుంటే.. సాహిత్యం మరీ శ్రుతి మించిందని.. ఒక బూతు పాటలా ఉందని ఇంకొందరంటున్నారు. సమంత విషయంలోనూ మిశ్రమ స్పందన వచ్చింది.
విడాకుల తర్వాత ఈ పాటలో కొంచెం హద్దులు దాటి ఎక్స్పోజింగ్ చేయడం పట్ల విమర్శలూ వచ్చాయి. మరోవైపు ఈ పాట ‘వీడొక్కడే’ సినిమాలోని ‘హనీ హనీ’ పాటకు కాపీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఐతే ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఈ పాట ఒక సెన్సేషన్ అనడంలో సందేహం లేదు. ఆల్రెడీ ‘ఊ అంటావా ఉఊ అంటావా మావా’ అనే హుక్ లైన్ జనాల నోళ్లలో బాగా నానుతోంది. పాటను మళ్లీ మళ్లీ వింటున్నారు. చూస్తున్నారు. రేప్పొద్దున సినిమా రిలీజయ్యాక ఈ పాట మరింత ఊపేయడం ఖాయం.
This post was last modified on December 12, 2021 9:14 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…