రెండు రోజుల కిందటే ‘పుష్ప’ మూవీ నుంచి ‘ఊ అంటావా ఉఊ అంటావా మావా’ అంటూ ఒక పాటను లాంచ్ చేశారు. ఇక అప్పట్నుంచి సోషల్ మీడియాలో ఈ పాట మోతెక్కిపోతోంది. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనే టైటిల్తో పాటను రిలీజ్ చేయగా.. ఆ ట్యాగ్కు తగ్గట్లే ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలో 1.4 కోట్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్తో ఈ పాట యూట్యూబ్ను షేక్ చేసేసింది.
సౌత్ ఇండియాలో 24 గంటల వ్యవధిలో అత్యధిక మంది వీక్షించిన పాటగా ఇది రికార్డ్ సృష్టించింది. ‘పుష్ప’ మీద ఉన్న అంచనాలకు తోడు సమంతతో ఐటెం సాంగ్ అనేసరికి ఈ పాటపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్న మాట వాస్తవం. అలాగే సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఐటెం సాంగ్ మీద అంచనాలు భారీగానే ఉంటాయి. ఇక వీరికి బన్నీ కూడా తోడయ్యాడు. కాబట్టి ఈ పాట రిలీజ్కు ముందే హైప్ వచ్చింది.
కానీ అంచనాలను మించిపోయి ఈ రేంజిలో పాటకు రెస్పాన్స్ వస్తుందని.. సోషల్ మీడియాను ఇంతలా ఈ పాట షేక్ చేస్తుందని ఊహించలేదు. అలాగని ఈ పాట విషయంలో విమర్శలు లేవా అంటే అలా ఏమీ కాదు. సుక్కు-దేవి సినిమాల్లో ఇంతకుముందు వచ్చిన పాటల స్థాయిలో ఇందులో ఊపు లేదని కొందరంటుంటే.. సాహిత్యం మరీ శ్రుతి మించిందని.. ఒక బూతు పాటలా ఉందని ఇంకొందరంటున్నారు. సమంత విషయంలోనూ మిశ్రమ స్పందన వచ్చింది.
విడాకుల తర్వాత ఈ పాటలో కొంచెం హద్దులు దాటి ఎక్స్పోజింగ్ చేయడం పట్ల విమర్శలూ వచ్చాయి. మరోవైపు ఈ పాట ‘వీడొక్కడే’ సినిమాలోని ‘హనీ హనీ’ పాటకు కాపీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఐతే ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఈ పాట ఒక సెన్సేషన్ అనడంలో సందేహం లేదు. ఆల్రెడీ ‘ఊ అంటావా ఉఊ అంటావా మావా’ అనే హుక్ లైన్ జనాల నోళ్లలో బాగా నానుతోంది. పాటను మళ్లీ మళ్లీ వింటున్నారు. చూస్తున్నారు. రేప్పొద్దున సినిమా రిలీజయ్యాక ఈ పాట మరింత ఊపేయడం ఖాయం.
This post was last modified on December 12, 2021 9:14 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు…
తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన…
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…
అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…
భారత్ మరోసారి టీ20 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో…
రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…