రెండు రోజుల కిందటే ‘పుష్ప’ మూవీ నుంచి ‘ఊ అంటావా ఉఊ అంటావా మావా’ అంటూ ఒక పాటను లాంచ్ చేశారు. ఇక అప్పట్నుంచి సోషల్ మీడియాలో ఈ పాట మోతెక్కిపోతోంది. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అనే టైటిల్తో పాటను రిలీజ్ చేయగా.. ఆ ట్యాగ్కు తగ్గట్లే ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలో 1.4 కోట్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్తో ఈ పాట యూట్యూబ్ను షేక్ చేసేసింది.
సౌత్ ఇండియాలో 24 గంటల వ్యవధిలో అత్యధిక మంది వీక్షించిన పాటగా ఇది రికార్డ్ సృష్టించింది. ‘పుష్ప’ మీద ఉన్న అంచనాలకు తోడు సమంతతో ఐటెం సాంగ్ అనేసరికి ఈ పాటపై ప్రత్యేక ఆసక్తి నెలకొన్న మాట వాస్తవం. అలాగే సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఐటెం సాంగ్ మీద అంచనాలు భారీగానే ఉంటాయి. ఇక వీరికి బన్నీ కూడా తోడయ్యాడు. కాబట్టి ఈ పాట రిలీజ్కు ముందే హైప్ వచ్చింది.
కానీ అంచనాలను మించిపోయి ఈ రేంజిలో పాటకు రెస్పాన్స్ వస్తుందని.. సోషల్ మీడియాను ఇంతలా ఈ పాట షేక్ చేస్తుందని ఊహించలేదు. అలాగని ఈ పాట విషయంలో విమర్శలు లేవా అంటే అలా ఏమీ కాదు. సుక్కు-దేవి సినిమాల్లో ఇంతకుముందు వచ్చిన పాటల స్థాయిలో ఇందులో ఊపు లేదని కొందరంటుంటే.. సాహిత్యం మరీ శ్రుతి మించిందని.. ఒక బూతు పాటలా ఉందని ఇంకొందరంటున్నారు. సమంత విషయంలోనూ మిశ్రమ స్పందన వచ్చింది.
విడాకుల తర్వాత ఈ పాటలో కొంచెం హద్దులు దాటి ఎక్స్పోజింగ్ చేయడం పట్ల విమర్శలూ వచ్చాయి. మరోవైపు ఈ పాట ‘వీడొక్కడే’ సినిమాలోని ‘హనీ హనీ’ పాటకు కాపీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఐతే ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఈ పాట ఒక సెన్సేషన్ అనడంలో సందేహం లేదు. ఆల్రెడీ ‘ఊ అంటావా ఉఊ అంటావా మావా’ అనే హుక్ లైన్ జనాల నోళ్లలో బాగా నానుతోంది. పాటను మళ్లీ మళ్లీ వింటున్నారు. చూస్తున్నారు. రేప్పొద్దున సినిమా రిలీజయ్యాక ఈ పాట మరింత ఊపేయడం ఖాయం.
This post was last modified on December 12, 2021 9:14 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…