బాలయ్యకు ఎదురు లేదునందమూరి బాలకృష్ణకు బాక్సాఫీస్ దగ్గర మామూలుగా కలిసి రావట్లేదిప్పుడు. కరోనా బ్రేక్ తర్వాత మంచి మాస్ సినిమా కోసం చాలా కాలం నుంచి ప్రేక్షకులు ఎదురు చూస్తున్న టైంలో విడుదల కావడం ‘అఖండ’కు బాగా కలిసొచ్చింది. బోయపాటితో బాలయ్య కాంబినేషన్ మీద ఉన్న గురి వల్ల ఈ సినిమాకు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. టాక్ మరీ గొప్పగా లేకపోయినా ఈ చిత్రానికి తొలి వారాంతంలో వసూళ్ల మోత మోగింది.
బాలయ్య కెరీర్లో హైయెస్ట్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ ఈ చిత్రం ముందుకు వెళ్తోంది. వీకెండ్ తర్వాత కూడా ఈ చిత్రానికి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీకెండ్లో అయితే సినిమా జోరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే ఏ సినిమా అయినా.. రెండో వారంలోకి వచ్చేసరికి జోరు తగ్గించేయడం.. కొత్త సినిమాలు లీడ్ తీసుకోవడం మామూలే. కానీ ‘అఖండ’కు అలాంటి అడ్డంకులేమీ కనిపించడం లేదు.
ఈ శుక్రవారం నాగశౌర్య ‘లక్ష్య’, శ్రియ సరన్ ‘గమనం’ చిత్రాలు రిలీజయ్యాయి. వీటితో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగాయి. కానీ ఇవేవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినట్లుగా కనిపించడం లేదు. ‘లక్ష్య’ మాస్ టచ్ ఉన్న సినిమానే అయినా.. ఎందుకో దీనిపై ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. ఉదయం మార్నింగ్ షోలకు థియేటర్లు వెలవెలబోయాయి. నాగశౌర్య గత సినిమాల ప్రభావం వల్లో.. ప్రమోషన్ సరిగా లేకపోవడం వల్లో.. కారణమేదైనా కానీ.. ‘లక్ష్య’ డల్ నోట్తో మొదలైంది. దీనికి తోడు బ్యాడ్ టాక్ రావడం కూడా దీనికి చేటు చేసేలా కనిపిస్తోంది.
మరోవైపు ‘గమనం’ చిత్రానికి అస్సలు బజ్ లేదు. పైగా ఈ సినిమాకు ముందు రోజు వేసిన ప్రిమియర్ షో నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా థియేటర్లు కూడా తొలి రోజే వెలవెలబోతున్నాయి. మిగతా సినిమాల గురించి చెప్పడానికేమీ లేదు. చూస్తుంటే ఈ పరిస్థితి ‘అఖండ’కు బాగానే కలిసొచ్చేలా ఉంది. రెండో వీకెండ్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రానికి శని, ఆదివారాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. ‘పుష్ప’ వచ్చే వరకు ఈ సినిమాకు ఎదురు లేనట్లే.
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని…
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
తమపై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాలని.. ఉద్దేశ పూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం తమపై నిషేధం విధించిందని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…