‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజైంది. ఎప్పట్లాగే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఇద్దరు హీరోలకూ వేర్వేరుగా హైరేంజ్ ఎలివేషన్ షాట్లు పెట్టిన రాజమౌళి.. ఓవరాల్గా చూస్తే తారక్ను కొంచెం తక్కువ చేసి చూపించాడని, క్యారెక్టర్ పరంగా రామ్ చరణే కొన్ని రకాలుగా పైచేయి సాధించాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే లుక్స్ విషయంలోనూ తారక్ కంటే చరణ్ మెరుగ్గా కనిపించాడు. అలాగని దీన్ని బట్టి ముందే ఒక అంచనాకు రావడం తప్పు.
రాజమౌళి ఉద్దేశపూర్వకంగా తారక్ను తక్కువ చేస్తాడని అస్సలు అనుకోలేం. ఇంకా చెప్పాలంటే తారక్ మీద ఆయనకు ప్రేమ ఎక్కువే. సినిమాలో కొంచెం తారక్నే హైలైట్ చేసినా ఆశ్చర్యం లేదు. ట్రైలర్ చూసి ఇలాంటి అభిప్రాయాలు కలగడానికి ఆయా పాత్రల స్వభావం ఒక కారణమన్నది అర్థం చేసుకోవాల్సిన విషయం. ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ చేసింది సీతారామరాజు పాత్ర. బేసిగ్గానే తెలుగు వాళ్లకు అదొక ఐకానిక్ క్యారెక్టర్. లుక్ పరంగా ఒక చాలా ఆకర్షణ ఉన్న పాత్ర అది. అల్లూరి సీతారామరాజు సినిమాతో ఆ పాత్రతో బాగా కనెక్ట్ అయి ఉన్నారు ప్రేక్షకులు.
అల్లూరి ఆహార్యం ఎంతో ఆకట్టుకునేలా ఉంటుంది కూడా. రామ్ చరణ్ ఆ పాత్రనే చేయడంతో లుక్స్ పరంగా హైలైట్ అయ్యాడు. అలాగే అతను చేసింది పోలీస్ క్యారెక్టర్ కావడం, అందుకోసం ఫిజిక్ పెంచడంతో ఆ రకంగానూ హైలైట్ అయ్యాడు. అలాగే పాత్ర కూడా ఆధిపత్యంతో కనిపించింది. కానీ తారక్ చేసింది కొమరం భీమ్ క్యారెక్టర్. అది ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి దాచుకుని తిరిగే గోండు వర్గానికి చెందిన పాత్ర. అందుకు తగ్గట్లే ఆ క్యారెక్టర్ను డిజైన్ చేశారు.
దీంతో ఆ పాత్ర డామినేషన్ ట్రైలర్లో కనిపించలేదు. లుక్స్ పరంగా కూడా తారక్ వెనుకబడ్డట్లు కనిపిస్తుంది. కానీ ఇదంతా పాత్ర శైలికి తగ్గట్లుగా చేసిన సెటప్. ట్రైలర్ చూసి ఏదో అనుకోవచ్చు కానీ.. సినిమాలో కథ ప్రధానంగా తారక్ చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. అలాగే ఎమోషన్లలో తారకే హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. కాబట్టి యాక్షన్ పార్ట్, లుక్స్ పరంగా చరణ్ డామినేషన్ ఉన్నప్పటికీ ఎమోషన్లలో తారక్ ముద్ర కనిపిస్తుందని.. నటన పరంగా అతను హైలైట్ అవుతాడని భావిస్తున్నారు. ఈ బ్యాలెన్స్ పాటించడంలో జక్కన్నను మించిన వాళ్లు ఎవరుంటారు మరి?
This post was last modified on December 9, 2021 8:27 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…