Prabhas
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాయలసీమలోని కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వరదల ధాటికి వందలాదిమంది నిరాశ్రయులు కాగా…62మంది వరకు మృత్యువాతపడ్డారు. వందల ఎకరాల్లో పంట నష్టం, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది.
ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు తమ వంతు సాయాన్ని ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితులకు రూ.1 కోటి ఆర్థిక సాయం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్కు ఆ నగదు మొత్తాన్ని అందజేస్తున్నట్లు ప్రభాస్.
ఇప్పుడే కాదు, గతంలో హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం,, కరోనా విపత్తు సమయంలోనూ ప్రభాస్ భారీ విరాళం అందించాడు. తాజాగా ప్రభాస్ భారీ మొత్తంలో విరాళమివ్వడంతో ఆయన ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. విరాళం ఇవ్వడంలోనూ ప్రభాస్ బాహుబలే అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కాగా, అంతకుముందు వరద బాధితులకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, సూపర్ స్టార్ మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ లు తలా రూ.25 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తర్వాత మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇదే బాటలో వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
This post was last modified on December 7, 2021 2:15 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…