Prabhas
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాయలసీమలోని కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వరదల ధాటికి వందలాదిమంది నిరాశ్రయులు కాగా…62మంది వరకు మృత్యువాతపడ్డారు. వందల ఎకరాల్లో పంట నష్టం, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది.
ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు తమ వంతు సాయాన్ని ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితులకు రూ.1 కోటి ఆర్థిక సాయం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్కు ఆ నగదు మొత్తాన్ని అందజేస్తున్నట్లు ప్రభాస్.
ఇప్పుడే కాదు, గతంలో హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం,, కరోనా విపత్తు సమయంలోనూ ప్రభాస్ భారీ విరాళం అందించాడు. తాజాగా ప్రభాస్ భారీ మొత్తంలో విరాళమివ్వడంతో ఆయన ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. విరాళం ఇవ్వడంలోనూ ప్రభాస్ బాహుబలే అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కాగా, అంతకుముందు వరద బాధితులకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, సూపర్ స్టార్ మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ లు తలా రూ.25 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తర్వాత మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇదే బాటలో వరదబాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
This post was last modified on December 7, 2021 2:15 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…