అప్పట్లో రాజకీయాల కోసం బ్రేక్ తీసుకున్నప్పుడు చిరంజీవి ఒక సినిమాలకి దూరమైపోయినట్టే అనుకున్నారంతా. కానీ ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత ఆచి తూచి అడుగులేస్తూ ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్తారులే అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మెగాస్టార్. గ్యాప్ వచ్చినా స్పీడ్ తగ్గలేదు. అందుకే ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలను పట్టాలెక్కించారు. అరుదైన రికార్డును నెలకొల్పారు.
ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్స్లో పాల్గొంటున్నారు చిరంజీవి. ఈ విషయాన్ని ఆయన టీమ్ సగర్వంగా ప్రకటించింది. కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ఫాదర్’, మెహెర్ రమేష్ డైరెక్షన్లో ‘భోళాశంకర్’లతో పాటు బాబి తెరకెక్కిస్తున్న తన 154వ సినిమా షూట్లోనూ బ్యాక్ టు బ్యాక్ పాల్గొంటున్నారు చిరంజీవి. ఇది ఆల్టైమ్ మెగా రికార్డ్ అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది.
ఒకప్పుడు స్టార్ హీరోలు ఒకే సమయంలో చాలా సినిమాలకి వర్క్ చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో పది పైన సినిమాలు చేసిన సంవత్సరాలు చాలానే ఉన్నాయి. కానీ రాను రాను ఇండస్ట్రీ తీరు మారింది. భారీ చిత్రాలకు తెర లేచింది. మేకింగ్కి టైమ్ పట్టడం మొదలైంది. పైగా సినిమా సినిమాకీ లుక్ మార్చడం, మేకోవరం కావడం లాంటివాటిని హీరోలు ప్రెస్టీజియస్గా, చాలెంజింగ్గా తీసుకోవడంతో ఒక టైమ్లో ఒక సినిమాయే చేయగలిగే పరిస్థితి వచ్చింది.
దాంతో చాలామంది హీరోలు ఇప్పటికీ ఒక సమయంలో ఒక సినిమాయే చేస్తుంటారు. వరుస సినిమాలకు కమిటైనా అది లైన్లో పెట్టడం వరకే. షూటింగ్ మాత్రం ఒక సినిమాకే జరుగుతూ ఉంటుంది. అలాంటిది చిరంజీవి లాంటి స్టార్ హీరో ఒకేసారి నాలుగు భారీ చిత్రాలకు వర్క్ చేయడం మామూలు విషయం కాదు. పైగా ఈ వయసులో అంత ఎనర్జీతో ఇంత వర్క్ చేయడం నిజంగా గ్రేట్. ఈ రేర్ ఫీట్తో యంగ్ హీరోలకి దీటుగా నిలబడటం ఆయనకే చెల్లింది. మిగతా హీరోలు ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…