అప్పట్లో రాజకీయాల కోసం బ్రేక్ తీసుకున్నప్పుడు చిరంజీవి ఒక సినిమాలకి దూరమైపోయినట్టే అనుకున్నారంతా. కానీ ఆయన రీ ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత ఆచి తూచి అడుగులేస్తూ ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్తారులే అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మెగాస్టార్. గ్యాప్ వచ్చినా స్పీడ్ తగ్గలేదు. అందుకే ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలను పట్టాలెక్కించారు. అరుదైన రికార్డును నెలకొల్పారు.
ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్స్లో పాల్గొంటున్నారు చిరంజీవి. ఈ విషయాన్ని ఆయన టీమ్ సగర్వంగా ప్రకటించింది. కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ఫాదర్’, మెహెర్ రమేష్ డైరెక్షన్లో ‘భోళాశంకర్’లతో పాటు బాబి తెరకెక్కిస్తున్న తన 154వ సినిమా షూట్లోనూ బ్యాక్ టు బ్యాక్ పాల్గొంటున్నారు చిరంజీవి. ఇది ఆల్టైమ్ మెగా రికార్డ్ అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది.
ఒకప్పుడు స్టార్ హీరోలు ఒకే సమయంలో చాలా సినిమాలకి వర్క్ చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో పది పైన సినిమాలు చేసిన సంవత్సరాలు చాలానే ఉన్నాయి. కానీ రాను రాను ఇండస్ట్రీ తీరు మారింది. భారీ చిత్రాలకు తెర లేచింది. మేకింగ్కి టైమ్ పట్టడం మొదలైంది. పైగా సినిమా సినిమాకీ లుక్ మార్చడం, మేకోవరం కావడం లాంటివాటిని హీరోలు ప్రెస్టీజియస్గా, చాలెంజింగ్గా తీసుకోవడంతో ఒక టైమ్లో ఒక సినిమాయే చేయగలిగే పరిస్థితి వచ్చింది.
దాంతో చాలామంది హీరోలు ఇప్పటికీ ఒక సమయంలో ఒక సినిమాయే చేస్తుంటారు. వరుస సినిమాలకు కమిటైనా అది లైన్లో పెట్టడం వరకే. షూటింగ్ మాత్రం ఒక సినిమాకే జరుగుతూ ఉంటుంది. అలాంటిది చిరంజీవి లాంటి స్టార్ హీరో ఒకేసారి నాలుగు భారీ చిత్రాలకు వర్క్ చేయడం మామూలు విషయం కాదు. పైగా ఈ వయసులో అంత ఎనర్జీతో ఇంత వర్క్ చేయడం నిజంగా గ్రేట్. ఈ రేర్ ఫీట్తో యంగ్ హీరోలకి దీటుగా నిలబడటం ఆయనకే చెల్లింది. మిగతా హీరోలు ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తోంది.
This post was last modified on December 7, 2021 10:27 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…