కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెంది నెల రోజులు దాటింది. కానీ ఈ విషాదం నుంచి అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. అతడి మీద కన్నడిగుల ప్రేమ ఏ స్థాయిలో ఉందన్నది ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. అతనెంత గొప్ప స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడో మరణానంతరమే ప్రపంచానికి పూర్తిగా తెలిసింది. పునీత్ ఇంత మంచోడా, ఇంత గొప్పోడా అనుకుంటూ కన్నడిగులే కాదు.
వేరే భాషల వాళ్లు కూడా అయ్యో అనుకున్నారు. పునీత్ మరణించిన సమయంలో కర్ణాటకలో వీధి వీధిలో అతడి చిత్రపటాలు పూలదండలతో దర్శనమివ్వడం చూసి ఓ నటుడిపై ఇంత అభిమానమా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాయి. ఇక కన్నడ కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు ఎలా పోటెత్తారో తెలిసిందే. లక్షల మందికి కడసారి చూపు చూసుకునే అవకాశం కల్పించినా.. ఇంకా ఎంతోమంది అవకాశం దొరక్క వెనుదిరిగారు.
కాగా రాజ్కుమార్ సమాధి పక్కనే పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలు అయ్యాక కొన్ని రోజులు విరామం ఇచ్చిన కుటుంబ సభ్యులు.. తర్వాత అభిమానుల సందర్శనకు అవకాశం కల్పించారు. ఆ రోజు నుంచీ ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా జనాలు వస్తూనే ఉన్నారు. రోజూ వేలమంది పునీత్ సమాధిని సందర్శిస్తూనే ఉన్నారు.
నిన్నటికి పునీత్ చనిపోయి 38 రోజులు అయింది. కాగా నిన్న ఆదివారం కావడంతో పునీత్ సమాధి సందర్శనకు జనం పోటెత్తారు. తిరుమల లాంటి పెద్ద ఆలయాల్లో దర్శనానికి క్యూ లైన్లలో నిలుచున్నట్లుగా.. దాదాపు అరకిలోమీటరు దూరం జనాలు నిలబడి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిన్న ఒక్క రోజు దాదాపు 35 వేల మంది పునీత్ సమాధిని సందర్శించారట. పునీత్ చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఇంతమంది అతడి సమాధి సందర్శనకు వస్తున్నారంటే అతడి మీద వారి ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on December 6, 2021 6:46 pm
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…
అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…
నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…