ఇంతకాలం గ్యాప్ తీసుకున్న నటుడు కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే ‘బింబిసార’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పుడు తొలిసారి ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తోంది.
ఈ ఏడాది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ ఓ సినిమాను మొదలుపెట్టారు. కొత్త దర్శకుడు రాజేంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదొక థ్రిల్లర్ కాన్సెప్ట్ తో నడిచే స్టోరీ. కథ ప్రకారం.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారట. నిజానికి ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ అలాంటి ప్రయత్నం చేయలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ.. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు.
గత కొన్నేళ్లలో మాత్రం ఆయన ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో ఇప్పుడు త్రిపాత్రాభినయం చేయడానికి రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.
This post was last modified on December 6, 2021 5:40 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…