అల్లు అర్జున్ ఈ మధ్య అనుకోని ఓ చిన్న వివాదంలో చిక్కుకున్నాడు. ర్యాపిడో అనే బైక్ రైడ్ సర్వింగ్ యాప్ కోసం బన్నీ చేసిన యాడ్ పట్ల అభ్యంతరాలు వ్యక్తం కావడం తెలిసిందే. ఈ యాడ్ మధ్యలో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు ఎక్కబోతుంటే అందులో జనాల మధ్య నలిగిపోతూ కష్టపడి ప్రయాణం చేయడం ఎందుకు.. చక్కగా ర్యాపిడో బుక్ చేసుకుని బైక్లో వెళ్లొచ్చు కదా అని బన్నీ చెప్పడం పట్ల తెలంగాణ ఆర్టీసీ వాళ్లకు ఆగ్రహం తెప్పించింది.
కొన్ని నెలల నుంచి టీఎస్ఆర్టీసీని నడిపిస్తున్న ఉన్నతాధికారి సజ్జనార్ ఈ యాడ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎస్ ఆర్టీసీ తరఫున ర్యాపిడో కంపెనీకి, బన్నీకి నోటీసులు ఇప్పించారు. వెంటనే ఈ యాడ్ ఆపేయాలన్నారు. ఆర్టీసీని తక్కువ చేసేలా, కించపరిచేలా ఈ యాడ్ ఉందన్నది వారి అభ్యంతరం. దీనిపై టీఎస్ ఆర్టీసీ అధికారులు కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
ఆర్టీసీ అధికారుల వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. ఈ యాడ్ అభ్యంతరకరమని పేర్కొంది. తక్షణం ఈ ప్రకటనను ఆపేయాలని ర్యాపిడో కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఐతే ఆర్టీసీ నుంచి నోటీసులు అందుకున్నాక ర్యాపిడో కంపెనీ ఈ ప్రకటనను కొంచెం మార్చింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడాన్ని వ్యతిరేకించేలా ఉన్న డైలాగ్ తీసేసింది. కానీ మార్చిన ప్రకటనలో కూడా ఆర్టీసీ బస్సు మాత్రం కనిపిస్తూనే ఉంది.
ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం పాతది, కొత్తది రెండు యాడ్స్ కూడా తీసేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సు కనిపించడానికి వీల్లేదు. కోర్టు ఇలా ఆదేశించడంతో ర్యాపిడో కంపెనీ ఇక కొత్త యాడ్ షూట్ చేసుకోక తప్పకపోవచ్చు. హిందీలో ఇదే యాడ్ను రణ్వీర్ సింగ్ మీద తీశారు. అక్కడ ఇలాంటి అభ్యంతరాలేమీ రాలేదు. ఐతే ఈ వివాదం వల్ల ‘ర్యాపిడో’ పరోక్షంగా కొంత పబ్లిసిటీ అయితే వచ్చింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…