అల్లు అర్జున్ ఈ మధ్య అనుకోని ఓ చిన్న వివాదంలో చిక్కుకున్నాడు. ర్యాపిడో అనే బైక్ రైడ్ సర్వింగ్ యాప్ కోసం బన్నీ చేసిన యాడ్ పట్ల అభ్యంతరాలు వ్యక్తం కావడం తెలిసిందే. ఈ యాడ్ మధ్యలో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు ఎక్కబోతుంటే అందులో జనాల మధ్య నలిగిపోతూ కష్టపడి ప్రయాణం చేయడం ఎందుకు.. చక్కగా ర్యాపిడో బుక్ చేసుకుని బైక్లో వెళ్లొచ్చు కదా అని బన్నీ చెప్పడం పట్ల తెలంగాణ ఆర్టీసీ వాళ్లకు ఆగ్రహం తెప్పించింది.
కొన్ని నెలల నుంచి టీఎస్ఆర్టీసీని నడిపిస్తున్న ఉన్నతాధికారి సజ్జనార్ ఈ యాడ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎస్ ఆర్టీసీ తరఫున ర్యాపిడో కంపెనీకి, బన్నీకి నోటీసులు ఇప్పించారు. వెంటనే ఈ యాడ్ ఆపేయాలన్నారు. ఆర్టీసీని తక్కువ చేసేలా, కించపరిచేలా ఈ యాడ్ ఉందన్నది వారి అభ్యంతరం. దీనిపై టీఎస్ ఆర్టీసీ అధికారులు కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
ఆర్టీసీ అధికారుల వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. ఈ యాడ్ అభ్యంతరకరమని పేర్కొంది. తక్షణం ఈ ప్రకటనను ఆపేయాలని ర్యాపిడో కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ఐతే ఆర్టీసీ నుంచి నోటీసులు అందుకున్నాక ర్యాపిడో కంపెనీ ఈ ప్రకటనను కొంచెం మార్చింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడాన్ని వ్యతిరేకించేలా ఉన్న డైలాగ్ తీసేసింది. కానీ మార్చిన ప్రకటనలో కూడా ఆర్టీసీ బస్సు మాత్రం కనిపిస్తూనే ఉంది.
ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం పాతది, కొత్తది రెండు యాడ్స్ కూడా తీసేయాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సు కనిపించడానికి వీల్లేదు. కోర్టు ఇలా ఆదేశించడంతో ర్యాపిడో కంపెనీ ఇక కొత్త యాడ్ షూట్ చేసుకోక తప్పకపోవచ్చు. హిందీలో ఇదే యాడ్ను రణ్వీర్ సింగ్ మీద తీశారు. అక్కడ ఇలాంటి అభ్యంతరాలేమీ రాలేదు. ఐతే ఈ వివాదం వల్ల ‘ర్యాపిడో’ పరోక్షంగా కొంత పబ్లిసిటీ అయితే వచ్చింది.
This post was last modified on December 5, 2021 10:32 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…