నందమూరి బాలకృష్ణ తన తండ్రి తర్వాత ఎంతో అభిమానించే సినీ నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన పట్ల బాలయ్య అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవభావం చూపించేవాడు ఒకప్పుడు. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో అక్కినేని కుటుంబానికి బాలయ్య దూరం అయిపోయాడు. నాగార్జునకు దూరం దూరం ఉంటూ వచ్చాడు. ఏఎన్నార్ చనిపోయినా చివరి చూపుకు బాలయ్య వెళ్లకపోవడం గమనార్హం. అంతలా అక్కినేని కుటుంబంతో ఏం ఇబ్బందులు ఉన్నాయో అని అంతా ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత కూడా బాలయ్య, నాగ్ కలిసి కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. మరి తెర వెనుక ఏం జరిగిందో ఏమో మీడియాలో అయితే ఏ సమాచారం లేదు. ఐతే ఇప్పుడు బాలయ్య తాను హోస్ట్ చేసే ‘అన్ స్టాపబుల్’ షోలో ఏఎన్నార్ను అనుకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘అన్ స్టాపబుల్’ మూడో ఎపిసోడ్లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్లో ఒక చోట బ్రహ్మానందం.. ఏఎన్నార్ను అనుకరించమంటూ బాలయ్యను అడిగాడు. బాలయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే అంటూ పైకి లేచి ఏఎన్నార్లా హావభావాలు పలికిస్తూ అచ్చం ఆయన లాగే వాయిస్ మార్చి నిమిషం పాటు ఏకధాటిగా ఒక గ్రాంథిక డైలాగ్ చెప్పాడు.
బాలయ్య తన తండ్రిని చాలాసార్లు అనుకరించాడు కానీ.. ఇలా ఏఎన్నార్ హావభావాలను, సంభాషణలను అనుకరించిన సందర్భాలు ఎప్పుడూ చూసి ఉండరు. అందులోనూ అక్కినేని కుటుంబంతో అనుకోకుండా వచ్చిన విభేదాల నేపథ్యంలో బాలయ్య ఈ టైంలో ఇలా ఏఎన్నార్ను అనుకరించడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలయ్య బాగా ప్రిపేరయ్యే నాగేశ్వరరావును అనుకరించాడని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.
This post was last modified on December 5, 2021 10:22 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అభ్యర్థులు…
హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…
మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…
తీన్మార్ మల్లన్న. నిత్యం మీడియాలో ఉంటూ..తనదైన శైలిలో గత కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింతపండు నవీన్ గురించి…
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…