నందమూరి బాలకృష్ణ తన తండ్రి తర్వాత ఎంతో అభిమానించే సినీ నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన పట్ల బాలయ్య అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవభావం చూపించేవాడు ఒకప్పుడు. ఐతే మధ్యలో ఏం జరిగిందో ఏమో అక్కినేని కుటుంబానికి బాలయ్య దూరం అయిపోయాడు. నాగార్జునకు దూరం దూరం ఉంటూ వచ్చాడు. ఏఎన్నార్ చనిపోయినా చివరి చూపుకు బాలయ్య వెళ్లకపోవడం గమనార్హం. అంతలా అక్కినేని కుటుంబంతో ఏం ఇబ్బందులు ఉన్నాయో అని అంతా ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత కూడా బాలయ్య, నాగ్ కలిసి కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. మరి తెర వెనుక ఏం జరిగిందో ఏమో మీడియాలో అయితే ఏ సమాచారం లేదు. ఐతే ఇప్పుడు బాలయ్య తాను హోస్ట్ చేసే ‘అన్ స్టాపబుల్’ షోలో ఏఎన్నార్ను అనుకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘అన్ స్టాపబుల్’ మూడో ఎపిసోడ్లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్లో ఒక చోట బ్రహ్మానందం.. ఏఎన్నార్ను అనుకరించమంటూ బాలయ్యను అడిగాడు. బాలయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే అంటూ పైకి లేచి ఏఎన్నార్లా హావభావాలు పలికిస్తూ అచ్చం ఆయన లాగే వాయిస్ మార్చి నిమిషం పాటు ఏకధాటిగా ఒక గ్రాంథిక డైలాగ్ చెప్పాడు.
బాలయ్య తన తండ్రిని చాలాసార్లు అనుకరించాడు కానీ.. ఇలా ఏఎన్నార్ హావభావాలను, సంభాషణలను అనుకరించిన సందర్భాలు ఎప్పుడూ చూసి ఉండరు. అందులోనూ అక్కినేని కుటుంబంతో అనుకోకుండా వచ్చిన విభేదాల నేపథ్యంలో బాలయ్య ఈ టైంలో ఇలా ఏఎన్నార్ను అనుకరించడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాలయ్య బాగా ప్రిపేరయ్యే నాగేశ్వరరావును అనుకరించాడని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.
This post was last modified on December 5, 2021 10:22 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…