చీటింగ్, మనీలాండరింగ్ కేసుల్లో సుఖేష్ చంద్రశేఖర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అటువంటి వ్యక్తి నుంచి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్లు భారీ ఎత్తున గిఫ్ట్ లు తీసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారంలో ఈడీ విచారణను ఎదుర్కొంటోంది నటి జాక్వెలిన్. సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ఈ బ్యూటీ కొన్ని విలువైన బహుమతులను పొందినట్లుగా ఈడీ పేర్కొంది.
సుఖేష్ చంద్రశేఖర్ కు వివాహం జరిగింది. అయినప్పటికీ జాక్వెలిన్ అతడితో క్లోజ్ గా ఉంది. వీరిద్దరూ కలిసి తీసుకున్న ముద్దు సెల్ఫీలు బయటకు వచ్చాయి. ఇప్పుడు సుఖేష్ పై కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. జాక్వెలిన్ పేరు కూడా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సుఖేష్ తో జాక్వెలిన్ డేటింగ్ చేస్తుందనే విషయాన్ని సుఖేష్ తరఫు లాయర్ కోర్టుకు వెల్లడించారు. కానీ జాక్వెలిన్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు.
ఈ విషయం పక్కన పెడితే.. సుఖేష్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల విలువైన బహుమతులను జాక్వెలిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో కొన్ని జంతువులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రూ.50 లక్షల విలువైన ఓ గుర్రాన్ని జాక్వెలిన్ కి గిఫ్ట్ గా ఇచ్చాడట. అలానే ఓ పిల్లిని కూడా ఇచ్చాడట. దాని రేటు అక్షరాల పది లక్షలు.
మరో హీరోయిన్ నోరా ఫతేహి కూడా సుఖేష్ నుంచి గిఫ్ట్ లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకి కోటి రూపాయల విలువైన బహుమతులు ఇచ్చాడట సుఖేష్. వాటిలో ఐఫోన్, కారు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సుఖేష్ స్వయంగా చెప్పాడట. దీంతో ఇప్పుడు నోరాను కూడా విచారిస్తున్నారు. మొత్తానికి సుఖేష్ నుంచి గిఫ్ట్ లు తీసుకొని అడ్డంగా బుక్కైపోయారు బాలీవుడ్ హీరోయిన్లు.
This post was last modified on December 5, 2021 8:29 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…