చీటింగ్, మనీలాండరింగ్ కేసుల్లో సుఖేష్ చంద్రశేఖర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అటువంటి వ్యక్తి నుంచి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్లు భారీ ఎత్తున గిఫ్ట్ లు తీసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారంలో ఈడీ విచారణను ఎదుర్కొంటోంది నటి జాక్వెలిన్. సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ఈ బ్యూటీ కొన్ని విలువైన బహుమతులను పొందినట్లుగా ఈడీ పేర్కొంది.
సుఖేష్ చంద్రశేఖర్ కు వివాహం జరిగింది. అయినప్పటికీ జాక్వెలిన్ అతడితో క్లోజ్ గా ఉంది. వీరిద్దరూ కలిసి తీసుకున్న ముద్దు సెల్ఫీలు బయటకు వచ్చాయి. ఇప్పుడు సుఖేష్ పై కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. జాక్వెలిన్ పేరు కూడా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సుఖేష్ తో జాక్వెలిన్ డేటింగ్ చేస్తుందనే విషయాన్ని సుఖేష్ తరఫు లాయర్ కోర్టుకు వెల్లడించారు. కానీ జాక్వెలిన్ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు.
ఈ విషయం పక్కన పెడితే.. సుఖేష్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల విలువైన బహుమతులను జాక్వెలిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో కొన్ని జంతువులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రూ.50 లక్షల విలువైన ఓ గుర్రాన్ని జాక్వెలిన్ కి గిఫ్ట్ గా ఇచ్చాడట. అలానే ఓ పిల్లిని కూడా ఇచ్చాడట. దాని రేటు అక్షరాల పది లక్షలు.
మరో హీరోయిన్ నోరా ఫతేహి కూడా సుఖేష్ నుంచి గిఫ్ట్ లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకి కోటి రూపాయల విలువైన బహుమతులు ఇచ్చాడట సుఖేష్. వాటిలో ఐఫోన్, కారు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సుఖేష్ స్వయంగా చెప్పాడట. దీంతో ఇప్పుడు నోరాను కూడా విచారిస్తున్నారు. మొత్తానికి సుఖేష్ నుంచి గిఫ్ట్ లు తీసుకొని అడ్డంగా బుక్కైపోయారు బాలీవుడ్ హీరోయిన్లు.
This post was last modified on December 5, 2021 8:29 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…