రాజశేఖర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఇద్దరు కూతుళ్లూ సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఇద్దరికీ కాలం కలిసి రాలేదు. ముందు రాజశేఖర్ పెద్దమ్మాయి శివానినే తెరంగేట్రం చేయాల్సింది. కానీ ఆమె హీరోయిన్గా మొదలైన బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్ రీమేక్ మధ్యలోనే ఆగిపోయింది. ఈలోపు చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని మూవీతో కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది.
ప్రస్తుతం ఆమె రంగమార్తాండలో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈలోపు శివాని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. అద్భుతం. తేజా సజ్జా సరసన శివాని నటించిన ఈ చిత్రం రెండేళ్ల ముందు మొదలైనప్పటికీ.. రకరకాల కారణాలతో విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ మధ్యే రిలీజైంది. కానీ దానికి థియేట్రికల్ రిలీజ్ కుదర్లేదు. హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఏమంత గొప్పగా లేదు.
శివానికి ఈ సినిమా ద్వారా అంత మంచి పేరు కూడా రాలేదు. ఏ హీరోయిన్ అయినా థియేట్రికల్ రిలీజ్తోనే అరంగేట్రం చేయాలనుకుంటుంది కానీ.. శివానికి ఆ అదృష్టం దక్కలేదు. కనీసం రెండో సినిమాతో అయినా ఆమె వెండితెరపై సందడి చేస్తుందేమో అనుకుంటే.. అదీ జరగలేదు. శివాని, అదిత్ అరుణ్ కీలక పాత్రలు పోషించిన డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యును థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు.
ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ టేకప్ చేసింది. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేశారన్నది తాజా సమాచారం. ఈ మధ్యే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సోనీ లివ్ సంస్థ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందట. కళ్యాణ్ రామ్తో 118 లాంటి హిట్ సినిమాను తీసిన సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కేవీ గుహన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on December 5, 2021 8:45 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…