రాజశేఖర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఇద్దరు కూతుళ్లూ సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఇద్దరికీ కాలం కలిసి రాలేదు. ముందు రాజశేఖర్ పెద్దమ్మాయి శివానినే తెరంగేట్రం చేయాల్సింది. కానీ ఆమె హీరోయిన్గా మొదలైన బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్ రీమేక్ మధ్యలోనే ఆగిపోయింది. ఈలోపు చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని మూవీతో కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది.
ప్రస్తుతం ఆమె రంగమార్తాండలో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈలోపు శివాని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. అద్భుతం. తేజా సజ్జా సరసన శివాని నటించిన ఈ చిత్రం రెండేళ్ల ముందు మొదలైనప్పటికీ.. రకరకాల కారణాలతో విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ మధ్యే రిలీజైంది. కానీ దానికి థియేట్రికల్ రిలీజ్ కుదర్లేదు. హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఏమంత గొప్పగా లేదు.
శివానికి ఈ సినిమా ద్వారా అంత మంచి పేరు కూడా రాలేదు. ఏ హీరోయిన్ అయినా థియేట్రికల్ రిలీజ్తోనే అరంగేట్రం చేయాలనుకుంటుంది కానీ.. శివానికి ఆ అదృష్టం దక్కలేదు. కనీసం రెండో సినిమాతో అయినా ఆమె వెండితెరపై సందడి చేస్తుందేమో అనుకుంటే.. అదీ జరగలేదు. శివాని, అదిత్ అరుణ్ కీలక పాత్రలు పోషించిన డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యును థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు.
ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ టేకప్ చేసింది. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేశారన్నది తాజా సమాచారం. ఈ మధ్యే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సోనీ లివ్ సంస్థ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందట. కళ్యాణ్ రామ్తో 118 లాంటి హిట్ సినిమాను తీసిన సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కేవీ గుహన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on December 5, 2021 8:45 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…