రాజశేఖర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఇద్దరు కూతుళ్లూ సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఇద్దరికీ కాలం కలిసి రాలేదు. ముందు రాజశేఖర్ పెద్దమ్మాయి శివానినే తెరంగేట్రం చేయాల్సింది. కానీ ఆమె హీరోయిన్గా మొదలైన బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్ రీమేక్ మధ్యలోనే ఆగిపోయింది. ఈలోపు చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని మూవీతో కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది.
ప్రస్తుతం ఆమె రంగమార్తాండలో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈలోపు శివాని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. అద్భుతం. తేజా సజ్జా సరసన శివాని నటించిన ఈ చిత్రం రెండేళ్ల ముందు మొదలైనప్పటికీ.. రకరకాల కారణాలతో విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ మధ్యే రిలీజైంది. కానీ దానికి థియేట్రికల్ రిలీజ్ కుదర్లేదు. హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఏమంత గొప్పగా లేదు.
శివానికి ఈ సినిమా ద్వారా అంత మంచి పేరు కూడా రాలేదు. ఏ హీరోయిన్ అయినా థియేట్రికల్ రిలీజ్తోనే అరంగేట్రం చేయాలనుకుంటుంది కానీ.. శివానికి ఆ అదృష్టం దక్కలేదు. కనీసం రెండో సినిమాతో అయినా ఆమె వెండితెరపై సందడి చేస్తుందేమో అనుకుంటే.. అదీ జరగలేదు. శివాని, అదిత్ అరుణ్ కీలక పాత్రలు పోషించిన డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యును థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు.
ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ టేకప్ చేసింది. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేశారన్నది తాజా సమాచారం. ఈ మధ్యే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సోనీ లివ్ సంస్థ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందట. కళ్యాణ్ రామ్తో 118 లాంటి హిట్ సినిమాను తీసిన సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కేవీ గుహన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉంటున్నారు. 2024లో కూడా మరోసారి మీరు తప్పు చేసి ఉంటే..…
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. తెలంగాణ హైకోర్టు ఈ రోజు భగీరథ్ కు…
తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత సంచలన డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ఖాతాలో ప్రస్తుతం 1400…
ఒకప్పుడు వచ్చిన సినిమాలు నోస్టాల్జిక్ ఫీలింగ్ ఎలా ఇస్తాయో వాటి వెనుక సంగతులు అంతే ఆసక్తి కలిగిస్తాయి. కాకపోతే అవి…
మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేసి మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి మెగా ఫ్యాన్స్ ని…
హైదరాబాద్ సుందరీకరణలో భాగంగా కీలకమైన మూసీ నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రక్షాళన…