రాజశేఖర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన ఇద్దరు కూతుళ్లూ సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ ఇద్దరికీ కాలం కలిసి రాలేదు. ముందు రాజశేఖర్ పెద్దమ్మాయి శివానినే తెరంగేట్రం చేయాల్సింది. కానీ ఆమె హీరోయిన్గా మొదలైన బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్ రీమేక్ మధ్యలోనే ఆగిపోయింది. ఈలోపు చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని మూవీతో కథానాయికగా పరిచయం అయింది. ఆ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది.
ప్రస్తుతం ఆమె రంగమార్తాండలో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈలోపు శివాని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే.. అద్భుతం. తేజా సజ్జా సరసన శివాని నటించిన ఈ చిత్రం రెండేళ్ల ముందు మొదలైనప్పటికీ.. రకరకాల కారణాలతో విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ మధ్యే రిలీజైంది. కానీ దానికి థియేట్రికల్ రిలీజ్ కుదర్లేదు. హాట్ స్టార్ ద్వారా డైరెక్ట్ ఆన్ లైన్లో రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఏమంత గొప్పగా లేదు.
శివానికి ఈ సినిమా ద్వారా అంత మంచి పేరు కూడా రాలేదు. ఏ హీరోయిన్ అయినా థియేట్రికల్ రిలీజ్తోనే అరంగేట్రం చేయాలనుకుంటుంది కానీ.. శివానికి ఆ అదృష్టం దక్కలేదు. కనీసం రెండో సినిమాతో అయినా ఆమె వెండితెరపై సందడి చేస్తుందేమో అనుకుంటే.. అదీ జరగలేదు. శివాని, అదిత్ అరుణ్ కీలక పాత్రలు పోషించిన డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యును థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు.
ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ టేకప్ చేసింది. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేశారన్నది తాజా సమాచారం. ఈ మధ్యే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సోనీ లివ్ సంస్థ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందట. కళ్యాణ్ రామ్తో 118 లాంటి హిట్ సినిమాను తీసిన సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కేవీ గుహన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on December 5, 2021 8:45 am
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…