సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రమోట్ చేయడం అంతకంటే ముఖ్యం. జనాలు థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే, ముందు సినిమా జనం దగ్గరికి వెళ్లాలి. అందుకే ప్రమోషన్స్ని రకరకాలుగా ప్లాన్ చేస్తుంటారు మేకర్స్. ఆ విషయంలో పుష్ప టీమ్ పదాకులు ఎక్కువే చదివిందనిపిస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. ఆల్రెడీ పాటలు, పోస్టర్లతో రికార్డులు సృష్టిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ట్రైలర్ కూడా రాబోతోంది. ఇదంతా మనకి తెలిసిన విషయం. తెలియకుండా వెనుక వేరే ప్లాన్స్ నడుస్తున్నాయి. అందులోనూ నార్త్లో ఈ చిత్రాన్ని మరింత స్పెషల్గా ప్రమోట్ చేయబోతున్నారు మేకర్స్.
బన్నీ నటిస్తున్న మొట్టమొదటి ప్యాన్ ఇండియా చిత్రమిది. తనకి ఆల్రెడీ తమిళ, మలయాళ భాషల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్లో కూడా అభిమానులు ఉన్నారు కానీ, వారి అభిమానం ఏ రేంజ్లో ఉందనేది క్లియర్గా తెలియదు. అందుకే అక్కడి వారికి రీచ్ అవ్వడానికి స్పెషల్ స్కెచ్ వేసింది పుష్ప టీమ్. బన్నీని బిగ్బాస్ షోకి గెస్ట్గా పంపబోతోంది. హిందీ బిగ్బాస్కి చాలా యేళ్లుగా సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఈ యేడు కూడా తనే హోస్ట్ చేస్తున్నాడు. వీకెండ్ ఎపిసోడ్లో ఇతర హీరోలు వచ్చి ఆ వేదిక మీద తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఈసారి బన్నీ కూడా వెళ్లబోతున్నట్లు నార్త్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బేసిగ్గా మెగా ఫ్యామిలీకి సల్లూ చాలా క్లోజ్. అందుకే ‘గాడ్ఫాదర్’లోనూ నటిస్తున్నాడు. ఆ సాన్నిహిత్యం కూడా అల్లు అర్జున్కి కలిసొచ్చిందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అదే కనుక జరిగితే, సల్మాన్ లాంటి స్టార్ హీరో ప్రమోట్ చేస్తే.. నార్త్ ఇండియన్స్కి పుష్పరాజ్ రీచ్ అవడం మరింత తేలికవుతుంది. కాబట్టి ఇది నిజంగా బెస్ట్ ఐడియా అనే చెప్పాలి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…