Movie News

మ‌హిళ‌ల సొమ్ముకు జ‌గ‌న్ ఎస‌రు.. 2000 కోట్లు.. ప్ర‌భుత్వ ప‌రం!

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం తీవ్ర‌మైన ఆర్ధిక సంక్షోభంలో  కొట్టుమిట్టాడుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ నిధులు స‌రిపోక నానా ప్ర‌యాస ప‌డుతోంది. వ‌చ్చిన సొమ్ము వ‌చ్చిన‌ట్టు.. ఖ‌ర్చయిపోతుండ‌డంతో.. ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉంది. ప‌థ‌కాలు.. సంక్షేమం.. అంటూ.. కోట్ల‌కు కోట్లు.. ఖర్చుపెడుతున్నామ‌ని.. ప్ర‌భుత్వం చెబుతున్నా.. దీనికి మించి ప్ర‌క‌ట‌నల ఖ‌ర్చు, స‌ల‌హాదారుల వేత‌నాల ఖ‌ర్చు వంటివి.. ప్ర‌భుత్వానికి గుదిబండ‌గా మారాయి. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ అప్పులు చేస్తూ.. రాష్ట్రంలో ఆర్థిక అస్త‌వ్య‌స్త‌త‌కు దారితీస్తున్నార‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే.. ప్ర‌భుత్వ భూముల‌ను అమ్ముకునేందుకు రంగం రెడీ చేశారు. అదేస‌మ‌యంలో కార్పొరేష‌న్ల ద్వారా.. 180 శాతం ప్ర‌భుత్వ గ్యారెంటీతో అప్పులు తెచ్చుకునేందుకు ఏకంగా స‌భ‌లోనే బిల్లు ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకున్నారు. ఇవ‌న్నీ జ‌రుగుతున్న క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అనేక సంస్కర‌ణ‌ల‌ను బీజేపీ పాలిత రాష్ట్రాలే కొన్ని వ్య‌తిరేకిస్తున్నా.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం నెత్తిన పెట్టుకుంటోంది. దీనిలో భాగ‌మే.. రైతుల ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీట‌ర్లు పెట్ట‌డం.. చెత్త‌పై ప‌న్ను, మ‌రుగుదొడ్ల షింకుల ఆధారంగా ప‌న్నులు వేస్తోంది.

ఇవ‌న్నీ కూడా రుణాల మంజూరు కోస‌మే. కేంద్రాన్ని ఎంత మెప్పిస్తే.. అంత ఎక్కువ‌గా రుణాలు తెచ్చుకునే అవ‌కాశం వ‌స్తుంది. దీనిని ఏపీ స‌ర్కారు వినియోగించుకునే ప్ర‌య‌త్నాలు .. ఇప్పుడు ఈ రుణాలు కూడా స‌రిపోవ‌డం లేదు. దీంతో గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన అభ‌య‌హ‌స్తం నిధుల‌ను కూడా వాడేసేందుకు రెడీ అయింది. అభ‌య హ‌స్తం.. ప‌థ‌కాన్ని వైఎస్ 2006లో తీసుకువ‌చ్చారు. దీనికింద డ్వాక్రా మ‌హిళ‌లు రోజుకు రూపాయి చొప్పున దాచుకుంటే.. దీనికి ప్ర‌భుత్వం మ‌రో రూపాయి జ‌మ చేస్తుంది. ఈ నిధుల‌ను ఎల్ ఐసీలో ఉంచారు. దీనికి పెద్ద ఒప్పంద‌మే ఉంది.

ఇక‌, ఇలా 2006 నుంచి ఇప్ప‌టి వ‌రకు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మ‌హిళ‌లు దాచుకున్న సొమ్ము ఏకంగా 2000 ఉంది. ఇప్పుడు ఈ సొమ్ముపై క‌న్నేసిన ఏపీ స‌ర్కారు.. ఈ నిధుల‌ను సొంతం చేసుకునేందుకు ఎల్ ఐసీతో ఉన్న ఒప్పందాన్ని ర‌ద్దు చేసింది. దీనిని ఎల్ ఐసీ తాజాగా ధ్రువీక‌రించింది. త‌మ‌కు అభ‌య‌హ‌స్తం ప‌థ‌కానికి సంబంధం లేద‌ని.. ఇక నుంచి మ‌హిళ‌ల‌కు ఎలాంటి పింఛ‌న్లు తాము ఇవ్వ‌బోమ‌ని.. స్ప‌ష్టం చేసింది. దీంతో ఇక‌, ఈ సొమ్ము.. ప్ర‌భుత్వం ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

6 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

44 minutes ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

51 minutes ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago