Movie News

మ‌హిళ‌ల సొమ్ముకు జ‌గ‌న్ ఎస‌రు.. 2000 కోట్లు.. ప్ర‌భుత్వ ప‌రం!

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం తీవ్ర‌మైన ఆర్ధిక సంక్షోభంలో  కొట్టుమిట్టాడుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ నిధులు స‌రిపోక నానా ప్ర‌యాస ప‌డుతోంది. వ‌చ్చిన సొమ్ము వ‌చ్చిన‌ట్టు.. ఖ‌ర్చయిపోతుండ‌డంతో.. ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఉంది. ప‌థ‌కాలు.. సంక్షేమం.. అంటూ.. కోట్ల‌కు కోట్లు.. ఖర్చుపెడుతున్నామ‌ని.. ప్ర‌భుత్వం చెబుతున్నా.. దీనికి మించి ప్ర‌క‌ట‌నల ఖ‌ర్చు, స‌ల‌హాదారుల వేత‌నాల ఖ‌ర్చు వంటివి.. ప్ర‌భుత్వానికి గుదిబండ‌గా మారాయి. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ అప్పులు చేస్తూ.. రాష్ట్రంలో ఆర్థిక అస్త‌వ్య‌స్త‌త‌కు దారితీస్తున్నార‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే.. ప్ర‌భుత్వ భూముల‌ను అమ్ముకునేందుకు రంగం రెడీ చేశారు. అదేస‌మ‌యంలో కార్పొరేష‌న్ల ద్వారా.. 180 శాతం ప్ర‌భుత్వ గ్యారెంటీతో అప్పులు తెచ్చుకునేందుకు ఏకంగా స‌భ‌లోనే బిల్లు ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకున్నారు. ఇవ‌న్నీ జ‌రుగుతున్న క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అనేక సంస్కర‌ణ‌ల‌ను బీజేపీ పాలిత రాష్ట్రాలే కొన్ని వ్య‌తిరేకిస్తున్నా.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం నెత్తిన పెట్టుకుంటోంది. దీనిలో భాగ‌మే.. రైతుల ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీట‌ర్లు పెట్ట‌డం.. చెత్త‌పై ప‌న్ను, మ‌రుగుదొడ్ల షింకుల ఆధారంగా ప‌న్నులు వేస్తోంది.

ఇవ‌న్నీ కూడా రుణాల మంజూరు కోస‌మే. కేంద్రాన్ని ఎంత మెప్పిస్తే.. అంత ఎక్కువ‌గా రుణాలు తెచ్చుకునే అవ‌కాశం వ‌స్తుంది. దీనిని ఏపీ స‌ర్కారు వినియోగించుకునే ప్ర‌య‌త్నాలు .. ఇప్పుడు ఈ రుణాలు కూడా స‌రిపోవ‌డం లేదు. దీంతో గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన అభ‌య‌హ‌స్తం నిధుల‌ను కూడా వాడేసేందుకు రెడీ అయింది. అభ‌య హ‌స్తం.. ప‌థ‌కాన్ని వైఎస్ 2006లో తీసుకువ‌చ్చారు. దీనికింద డ్వాక్రా మ‌హిళ‌లు రోజుకు రూపాయి చొప్పున దాచుకుంటే.. దీనికి ప్ర‌భుత్వం మ‌రో రూపాయి జ‌మ చేస్తుంది. ఈ నిధుల‌ను ఎల్ ఐసీలో ఉంచారు. దీనికి పెద్ద ఒప్పంద‌మే ఉంది.

ఇక‌, ఇలా 2006 నుంచి ఇప్ప‌టి వ‌రకు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మ‌హిళ‌లు దాచుకున్న సొమ్ము ఏకంగా 2000 ఉంది. ఇప్పుడు ఈ సొమ్ముపై క‌న్నేసిన ఏపీ స‌ర్కారు.. ఈ నిధుల‌ను సొంతం చేసుకునేందుకు ఎల్ ఐసీతో ఉన్న ఒప్పందాన్ని ర‌ద్దు చేసింది. దీనిని ఎల్ ఐసీ తాజాగా ధ్రువీక‌రించింది. త‌మ‌కు అభ‌య‌హ‌స్తం ప‌థ‌కానికి సంబంధం లేద‌ని.. ఇక నుంచి మ‌హిళ‌ల‌కు ఎలాంటి పింఛ‌న్లు తాము ఇవ్వ‌బోమ‌ని.. స్ప‌ష్టం చేసింది. దీంతో ఇక‌, ఈ సొమ్ము.. ప్ర‌భుత్వం ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on November 29, 2021 1:37 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

15 minutes ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

3 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

3 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

5 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

7 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

8 hours ago