టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇప్పుడు మిగిలిన భాషల్లో కూడా పాగా వేయాలని చూస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కి చెందిన టాప్ ప్రొడక్షన్ హౌస్ తో డీల్ ఫిక్స్ చేసుకోవాలని చూస్తుంది. బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ అనేది బిగ్ ప్రొడక్షన్ హౌస్. హీరోయిన్లతో కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవడంలో ఈ సంస్థ ఆచితూచి వ్యవహరిస్తుంటుంది.
గతంలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, కరీనా కపూర్ లాంటి ఎంతోమంది హీరోయిన్లు యష్ రాజ్ సినిమాలతో పాపులర్ అయ్యారు. రెమ్యునరేషన్ తక్కువగా ఇచ్చినా.. ఆ బ్యానర్ లో సినిమాలు చేయడం వారి కెరీర్ కి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు సమంత కూడా ఈ సంస్థ తో బాలీవుడ్ లీగ్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తోంది. ఒకేసారి రెండు, మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో ఉంది సామ్.
అయితే యష్ రాజ్ ఫిలిమ్స్ తో డీల్ అంటే మాములుగా ఉండదు. మూడ్నాలుగేళ్ల పాటు లాక్ అయిపోయినట్లే. ఈ గ్యాప్ లో బయట బ్యానర్లలో నటించే అవకాశం వచ్చినా.. వదులుకోవాల్సిందే. ప్రస్తుతం సమంత తమిళంలో ఓ సినిమా, తెలుగులో ఓ సినిమా కమిట్ అయింది. వీటితో పాటు ఓ ఇంటర్నేషనల్ సినిమా కూడా ఒప్పుకుంది. మరి బాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి!
This post was last modified on November 29, 2021 1:08 pm
కేరళ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించడం అంటే కేవలం మలయాళ అభిమానులకే కాదు…
కండల వీరుడు సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో నిర్మాత దిల్ రాజు తీస్తున్న భారీ చిత్రం ఇటీవలే…
టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం…
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…