పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తుల్ని గౌరవించే తీరే వేరుగా ఉంటుంది. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు, కుటుంబ సభ్యుల్ని కూడా పవన్ ‘గారు’ అనే సంబోధిస్తారు. వేదికల మీద చిరంజీవి గురించి మాట్లాడేటపుడు కూడా చాలాసార్లు ‘చిరంజీవి గారు’ అనే సంబోధిస్తాడు. తనకు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ విషయంలోనూ అంతే.
తనకంటే చిన్నవాళ్ల ప్రస్తావన వచ్చినపుడు కూడా ‘గారు’ మరిచిపోడు పవన్. ఐతే పవన్ బహిరంగ వేదికల్లో మాత్రమే ఇలా మాట్లాడతాడని చాలామంది అనుకుంటారు కానీ.. మామూలుగా కూడా ఆయన అంతే అంటున్నాడు పవర్ స్టార్తో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నదర్శకుడు వేణు శ్రీరామ్. పవన్ ఎంత టెన్షన్లో ఉన్నా కూడా ‘గారు’ అనడం మరిచిపోడని అతను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
‘‘పవన్ కళ్యాణ్ గారి నుంచి రోజూ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఆయన కమిట్మెంటే వేరు. చుట్టూ ఉన్న మనుషులందరినీ ఒకేలా చూడటం ఆయనలోని గొప్ప లక్షణం. కంగారులో కూడా పేరు పక్కన ‘గారు’ చేర్చడం మరిచిపోరు. సెట్లో సమయం దొరికితే అందరితో సరదాగా మాట్లాడతారు. మన గురించి అన్ని విషయాలూ తెలుసుకుంటారు. పుస్తకాలు చదువుతారా.. ఏమేం చదివారు అని అడుగుతారు’’ అని వేణు చెప్పాడు.
ఇక ‘వకీల్ సాబ్’ గురించి మాట్లాడుతూ.. దీని ఒరిజినల్ ‘పింక్’లో గొప్ప విషయం ఉందని.. ఒక మంచి మాట చెప్పాలంటే ఆ చెప్పే వాళ్లకు కూడా ఒక స్థాయి ఉండాలని.. అప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని.. పవన్ అలాంటి వ్యక్తే కాబట్టి సమాజంలోకి బలమైన సందేశం వెళ్తుందని ఆశిస్తున్నామని వేణు అన్నాడు. ‘వకీల్ సాబ్’ కథలో కొన్ని పరిమితులన్నాయని.. వాటిలోనే అభిమానులకు నచ్చేలా పవన్ను చూపించే ప్రయత్నం చేశామని వేణు తెలిపాడు.
This post was last modified on June 7, 2020 10:24 pm
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…