పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తుల్ని గౌరవించే తీరే వేరుగా ఉంటుంది. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు, కుటుంబ సభ్యుల్ని కూడా పవన్ ‘గారు’ అనే సంబోధిస్తారు. వేదికల మీద చిరంజీవి గురించి మాట్లాడేటపుడు కూడా చాలాసార్లు ‘చిరంజీవి గారు’ అనే సంబోధిస్తాడు. తనకు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ విషయంలోనూ అంతే.
తనకంటే చిన్నవాళ్ల ప్రస్తావన వచ్చినపుడు కూడా ‘గారు’ మరిచిపోడు పవన్. ఐతే పవన్ బహిరంగ వేదికల్లో మాత్రమే ఇలా మాట్లాడతాడని చాలామంది అనుకుంటారు కానీ.. మామూలుగా కూడా ఆయన అంతే అంటున్నాడు పవర్ స్టార్తో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నదర్శకుడు వేణు శ్రీరామ్. పవన్ ఎంత టెన్షన్లో ఉన్నా కూడా ‘గారు’ అనడం మరిచిపోడని అతను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
‘‘పవన్ కళ్యాణ్ గారి నుంచి రోజూ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఆయన కమిట్మెంటే వేరు. చుట్టూ ఉన్న మనుషులందరినీ ఒకేలా చూడటం ఆయనలోని గొప్ప లక్షణం. కంగారులో కూడా పేరు పక్కన ‘గారు’ చేర్చడం మరిచిపోరు. సెట్లో సమయం దొరికితే అందరితో సరదాగా మాట్లాడతారు. మన గురించి అన్ని విషయాలూ తెలుసుకుంటారు. పుస్తకాలు చదువుతారా.. ఏమేం చదివారు అని అడుగుతారు’’ అని వేణు చెప్పాడు.
ఇక ‘వకీల్ సాబ్’ గురించి మాట్లాడుతూ.. దీని ఒరిజినల్ ‘పింక్’లో గొప్ప విషయం ఉందని.. ఒక మంచి మాట చెప్పాలంటే ఆ చెప్పే వాళ్లకు కూడా ఒక స్థాయి ఉండాలని.. అప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని.. పవన్ అలాంటి వ్యక్తే కాబట్టి సమాజంలోకి బలమైన సందేశం వెళ్తుందని ఆశిస్తున్నామని వేణు అన్నాడు. ‘వకీల్ సాబ్’ కథలో కొన్ని పరిమితులన్నాయని.. వాటిలోనే అభిమానులకు నచ్చేలా పవన్ను చూపించే ప్రయత్నం చేశామని వేణు తెలిపాడు.
This post was last modified on June 7, 2020 10:24 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…