టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఇంట తీవ్ర విషాదం ఏర్పడింది. శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు ఈ రోజు తెల్లవారుఝామున 4గంటలకు తుది శ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కందుపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
కృష్ణారావు అంత్యక్రియలు ఈ రోజు కందులపాలెంటో జరగనున్నట్లు తెలుస్తోంది. కృష్ణారావుకు శ్రీనువైట్లతోపాటు ఒక కుమార్తె ఉన్నారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు….శ్రీను వైట్లకు ఫోన్ చేసి తమ సంతాపం తెలిపారు. కృష్ణారావు ఆత్మకు శాంతిచేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ఢీ చిత్రం సీక్వెల్…‘ఢీ అంటే ఢీ’ని తెరకెక్కిస్తున్నారు. 2011లో దూకుడు, 2013లో బాద్షా వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన శ్రీను వైట్ల…ఆ తరువాత ఆ స్థాయి హిట్ అందుకోలేదు. చివరగా మూడేళ్ల క్రితం రవితేజతో `అమర్ అక్బర్ ఆంటోనీ` చిత్రాన్ని రూపొందించిన శ్రీను వైట్ల…ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఢీ అంటే ఢీ చిత్రం చేస్తున్నారు.
This post was last modified on November 28, 2021 12:48 pm
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…