టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఇంట తీవ్ర విషాదం ఏర్పడింది. శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు ఈ రోజు తెల్లవారుఝామున 4గంటలకు తుది శ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కందుపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
కృష్ణారావు అంత్యక్రియలు ఈ రోజు కందులపాలెంటో జరగనున్నట్లు తెలుస్తోంది. కృష్ణారావుకు శ్రీనువైట్లతోపాటు ఒక కుమార్తె ఉన్నారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు….శ్రీను వైట్లకు ఫోన్ చేసి తమ సంతాపం తెలిపారు. కృష్ణారావు ఆత్మకు శాంతిచేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ఢీ చిత్రం సీక్వెల్…‘ఢీ అంటే ఢీ’ని తెరకెక్కిస్తున్నారు. 2011లో దూకుడు, 2013లో బాద్షా వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన శ్రీను వైట్ల…ఆ తరువాత ఆ స్థాయి హిట్ అందుకోలేదు. చివరగా మూడేళ్ల క్రితం రవితేజతో `అమర్ అక్బర్ ఆంటోనీ` చిత్రాన్ని రూపొందించిన శ్రీను వైట్ల…ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఢీ అంటే ఢీ చిత్రం చేస్తున్నారు.
This post was last modified on November 28, 2021 12:48 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…