ఈ సోషల్ మీడియా యుగంలో సెలబ్రెటీల ఆరోగ్యాలు, వ్యక్తిగత విషయాల గురించి ఏ వార్తను నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థం కాదు. నిక్షేపంగా ఉన్న వాళ్లను చంపేయడం.. కాస్త అనారోగ్యం అనగానే పరిస్థితి విషమం అని ప్రచారం చేయడం చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. చంద్రమోహన్ సహా చాలామంది విషయంలో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాల గురించి తెలిసిందే. ఇప్పుడు దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి కూడా నెగెటివ్ న్యూస్ సోషల్ మీడియాలో తిరుగుతోంది.
సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, రెండు రోజుల నుంచి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన్ని తాజాగా కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారని, ప్రస్తుతం సిరివెన్నెలకు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి బాగా లేదని కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై సిరివెన్నెల కుటుంబం స్పందించింది.
సీతారామశాస్త్రి అనారోగ్యంతో బాధపడుతున్న మాట వాస్తవమే అని.. కానీ ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబం స్పష్టత ఇచ్చింది. సీతారామశాస్త్రి న్యుమోనియాతో ఇబ్బంది పడుతుండడంతోనే ఆసుపత్రిలో జాయిన్ చేశామని, ఇది రెగ్యులర్ చెకప్లో భాగమేనని, తీవ్ర అస్వస్థత పరిస్థితుల్లో ఏమీ ఆయన లేరని.. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. సిరివెన్నెలకు ముందు కొవిడ్ సోకిందని.. తర్వాత న్యుమోనియా అటాక్ అయిందని ప్రచారం సాగుతోంది.
This post was last modified on November 28, 2021 10:03 am
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…
న్యాచురల్ స్టార్ నాని డిమాండ్ మాములుగా లేదు. ఊర మాస్ దసరా చేసినా, ఎమోషనల్ హాయ్ నాన్నగా వచ్చినా హిట్టుకు…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగం సభలో చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్…