Movie News

ఆ దర్శకుడి బాధ అంతా ఇంతా కాదు

వెన్నెల, ప్రస్థానం సినిమాలతో తనపై అంచనాలు పెంచిన దర్శకుడు దేవా కట్టా. కానీ ఆ తర్వాత ఆయన ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. వరుస పరాజయాలతో కెరీర్లో చాలా గ్యాప్ వచ్చాక.. బాగా టైం తీసుకుని తయారు చేసుకున్న స్క్రిప్టుతో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘రిపబ్లిక్’ సినిమా తీశాడు. ఐతే ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కలేదు. మరీ సీరియస్ సినిమా కావడం.. ట్రాజిక్ క్లైమాక్స్ లాంటి అంశాలు సినిమాకు చేటు చేశాయి.

రిలీజ్ ముంగిట హీరో సాయిధరమ్ తేజ్ అందుబాటులో లేకపోవడం, ప్రమోషన్లు సరిగా చేయకపోవడం కూడా సినిమాకు ప్రతికూలం అయ్యాయి. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఐతే మంచి కాన్సెప్ట్‌ ఎంచుకుని ఎంతో సిన్సియర్‌గా సినిమా తీసినా సరైన ఫలితం దక్కనందుకు దేవా కట్టా చాలానే బాధ పడ్డాడన్నది సన్నిహితుల సమాచారం.

‘రిపబ్లిక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొట్టుకుపోతున్నపుడు దాన్ని నిలబెట్టడానికి ఒంటరి పోరాటం చేశాడు దేవా. ట్విట్టర్లో ఈ సినిమా గురించి వేసిన పాజిటివ్ ట్వీట్లన్నీ రీట్వీట్ చేస్తూ సినిమాను జనాలకు చేరువ చేయడానికి ప్రయత్నించాడు. థియేట్రికల్ రన్ ముగిశాక ఇప్పుడు కూడా దేవా తన పోరాటం ఆపట్లేదు. ఈ చిత్రాన్ని జీ5 వాళ్లు స్ట్రీమ్ చేయనున్న నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ స్థాయిలో హడావుడి కనిపిస్తోంది. దీని కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారు.

ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు. ఇక నెటిజన్లు సినిమా చూసి పాజిటివ్ కామెంట్లు పెడుతుంటే.. వాటిని మళ్లీ పెద్ద ఎత్తున రీట్వీట్ చేస్తూ తాను తీసింది చాలా మంచి సినిమా, గొప్ప సినిమా అని సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు దేవా. మధ్యలో ఒక నెటిజన్ ‘రిపబ్లిక్-2’ తీస్తానని ప్రామిస్ చేయండి అని అంటే.. సీరియస్ సినిమాలను థియేటర్‌కు వెళ్లి చూస్తానని మీరు ప్రామిస్ చేయండి అంటూ తాను మంచి సినిమా తీస్తే దాన్ని థియేటర్లలో చూసి ఆదరించని ప్రేక్షకులకు పరోక్షంగా కౌంటర్ వేశాడు దేవా.

This post was last modified on November 27, 2021 6:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

20 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

40 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago