వెన్నెల, ప్రస్థానం సినిమాలతో తనపై అంచనాలు పెంచిన దర్శకుడు దేవా కట్టా. కానీ ఆ తర్వాత ఆయన ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. వరుస పరాజయాలతో కెరీర్లో చాలా గ్యాప్ వచ్చాక.. బాగా టైం తీసుకుని తయారు చేసుకున్న స్క్రిప్టుతో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘రిపబ్లిక్’ సినిమా తీశాడు. ఐతే ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కలేదు. మరీ సీరియస్ సినిమా కావడం.. ట్రాజిక్ క్లైమాక్స్ లాంటి అంశాలు సినిమాకు చేటు చేశాయి.
రిలీజ్ ముంగిట హీరో సాయిధరమ్ తేజ్ అందుబాటులో లేకపోవడం, ప్రమోషన్లు సరిగా చేయకపోవడం కూడా సినిమాకు ప్రతికూలం అయ్యాయి. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఫెయిల్యూర్గా నిలిచింది. ఐతే మంచి కాన్సెప్ట్ ఎంచుకుని ఎంతో సిన్సియర్గా సినిమా తీసినా సరైన ఫలితం దక్కనందుకు దేవా కట్టా చాలానే బాధ పడ్డాడన్నది సన్నిహితుల సమాచారం.
‘రిపబ్లిక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొట్టుకుపోతున్నపుడు దాన్ని నిలబెట్టడానికి ఒంటరి పోరాటం చేశాడు దేవా. ట్విట్టర్లో ఈ సినిమా గురించి వేసిన పాజిటివ్ ట్వీట్లన్నీ రీట్వీట్ చేస్తూ సినిమాను జనాలకు చేరువ చేయడానికి ప్రయత్నించాడు. థియేట్రికల్ రన్ ముగిశాక ఇప్పుడు కూడా దేవా తన పోరాటం ఆపట్లేదు. ఈ చిత్రాన్ని జీ5 వాళ్లు స్ట్రీమ్ చేయనున్న నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ స్థాయిలో హడావుడి కనిపిస్తోంది. దీని కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారు.
ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు. ఇక నెటిజన్లు సినిమా చూసి పాజిటివ్ కామెంట్లు పెడుతుంటే.. వాటిని మళ్లీ పెద్ద ఎత్తున రీట్వీట్ చేస్తూ తాను తీసింది చాలా మంచి సినిమా, గొప్ప సినిమా అని సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు దేవా. మధ్యలో ఒక నెటిజన్ ‘రిపబ్లిక్-2’ తీస్తానని ప్రామిస్ చేయండి అని అంటే.. సీరియస్ సినిమాలను థియేటర్కు వెళ్లి చూస్తానని మీరు ప్రామిస్ చేయండి అంటూ తాను మంచి సినిమా తీస్తే దాన్ని థియేటర్లలో చూసి ఆదరించని ప్రేక్షకులకు పరోక్షంగా కౌంటర్ వేశాడు దేవా.
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…