Movie News

అలాంటి సినిమాలు చేయాలని అడుక్కున్న హీరో

షాహిద్ కపూర్.. బాలీవుడ్లో దాదాపు రెండు దశాబ్దాల నుంచి హీరోగా కొనసాగుతున్నాడు. కానీ ఎప్పుడూ ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. అడపా దడపా హిట్లు కొడుతున్నా చాలామంది స్టార్ హీరోల మాదిరి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించడంలో అతను విఫలమయ్యాడు. నిన్నా మొన్నా వచ్చిన టైగర్ ష్రాఫ్ లాంటి యంగ్ హీరోల సినిమాలు వసూళ్ల మోత మోగిస్తుంటే షాహిద్ కపూర్ ఒక పరిధి దాటి ఎదగకపోవడం తన అభిమానులకు ఇబ్బందిగానే అనిపించింది.

ఐతే ‘కబీర్ సింగ్’ మూవీతో షాహిద్ రాత మారిపోయింది. అతను కూడా వందల కోట్ల వసూళ్లు రాబట్టే హీరో అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ఆ చిత్రం 2019లో విడుదలై ఫుల్ రన్లో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. దీంతో అతడి కరువంతా తీరిపోయింది. దీని తర్వాత షాహిద్ నుంచి రానున్న మరో తెలుగు రీమేక్ మూవీ ‘జెర్సీ’ మీదా భారీగానే అంచనాలున్నాయి. ఇది కూడా ‘కబీర్ సింగ్’ తరహాలోనే వసూళ్ల మోత మోగిస్తుందని భావిస్తున్నారు.

కాగా ‘కబీర్ సింగ్’ చేయడానికి ముందు తన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని.. మిగతా హీరోల చిత్రాల్లా తన సినిమాలు భారీ వసూళ్లు సాధించడం లేదేంటని బాధ పడేవాడినని ‘జెర్సీ’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా షాహిద్ గుర్తు చేసుకున్నాడు. 200-250 కోట్ల వసూళ్లు తెచ్చిన సినిమాలను రూపొందించిన దర్శకులు, నిర్మాతల దగ్గరికెళ్లి తనతోనూ అలాంటి సినిమాలు తీయాలని తాను అడుక్కుున్నట్లు షాహిద్ వెల్లడించడం విశేషం. ఐతే వాళ్లెవ్వరూ తనతో సినిమా తీయకపోయినా సందీప్ రెడ్డి ‘కబీర్ సింగ్’ మూవీతో తన కోరిక నెరవేర్చినట్లు చెప్పాడు.

ఇక ‘జెర్సీ’ గురించి మాట్లాడుతూ.. ‘కబీర్ సింగ్’ విడుదలకు ముందే తనను గౌతమ్ ఈ కథతో సంప్రదించాడని, కానీ అప్పుడు అతడికి నో చెప్పానని.. కానీ తన కోసం వెయిట్ చేసి చివరికి ఈ సినిమా తీశాడని షాహిద్ వెల్లడించాడు. ‘జెర్సీ’ ఒరిజినల్ చూసినపుడు తాను ఎంత ఏడ్చానో తనకే తెలియదని షాహిద్ చెప్పడం విశేషం.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

6 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago