Dil Raju
ప్రస్తుతం టాలీవుడ్ అనే కాక ఇండియాలోనే అత్యంత బిజీగా ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. తెలుగులో ఎఫ్3, శాకుంతలం, హిందీలో జెర్సీ, ఎఫ్-2, హిట్ రీమేక్స్.. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ.. ఇవీ ఆయన ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రాలు. ఇంకా విజయ్ హీరో ఓ ద్విభాషా చిత్రం లైన్లో ఉంది. ప్రభాస్, అల్లు అర్జున్లతోనూ ఆయనకు కమిట్మెంట్లు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలనూ భారీ స్థాయిలోనే రాజు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు రాజు చేతికి ఒక మెగా ప్రాజెక్టు అనుకోకుండా వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ సినిమాకు దర్శకుడు రాజమౌళి కాగా.. హీరో మహేష్ బాబు. అదేంటి ఈ కాంబినేషన్లో సినిమాను సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ కదా నిర్మిస్తోంది అన్న సందేహం రాకుండా ఉండదు. అది నిజమే కానీ. ఈ ప్రాజెక్టులో రాజు కూడా భాసగ్వామి అవుతున్నాడనది తాజా సమాచారం.
కేఎల్ నారాయణ సినిమా నిర్మాణం పక్కన పెట్టేసి చాలా ఏళ్లయింది. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో బిజీ అయిపోయారు. కాకపోతే తాను నిర్మాగా యాక్టివ్గా ఉన్న సమయంలో తనకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాజమౌళి ఇప్పుడు సినిమా చేయడానికి ముందుకు రావడంతో మళ్లీ దుర్గా ఆర్ట్స్ దుమ్ము దులుపుతున్నారు. ఐతే ఆయన సినిమాలు చేసే టైంకి, ఇప్పటికి మొత్తం వ్యవహారం మారిపోయింది. ప్రొడక్షన్ అనే కాక సినిమా బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ అంతా మారాయి. దీనికి తోడు సినిమాకు బడ్జెట్ కూడా వందల కోట్లలో పెట్టాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో తానొక్కడినే ఈ సినిమాను హ్యాండిల్ చేయడం కష్టమన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ పరంగా తిరుగులేని స్థాయిలో ఉన్న దిల్ రాజును ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానించాడట నారాయణ. రాజమౌళి-మహేష్ కాంబినేషన్లో సినిమాలో భాగస్వామి అవమంటే రాజు ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాడు. వెంటనే ఓకే చెప్పేశాడని.. ఆయన కూడా ఈ ప్రాజెక్టులో పార్టనర్ అనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు.
This post was last modified on November 24, 2021 1:32 pm
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…