Dil Raju
ప్రస్తుతం టాలీవుడ్ అనే కాక ఇండియాలోనే అత్యంత బిజీగా ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. తెలుగులో ఎఫ్3, శాకుంతలం, హిందీలో జెర్సీ, ఎఫ్-2, హిట్ రీమేక్స్.. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ.. ఇవీ ఆయన ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రాలు. ఇంకా విజయ్ హీరో ఓ ద్విభాషా చిత్రం లైన్లో ఉంది. ప్రభాస్, అల్లు అర్జున్లతోనూ ఆయనకు కమిట్మెంట్లు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలనూ భారీ స్థాయిలోనే రాజు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు రాజు చేతికి ఒక మెగా ప్రాజెక్టు అనుకోకుండా వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ సినిమాకు దర్శకుడు రాజమౌళి కాగా.. హీరో మహేష్ బాబు. అదేంటి ఈ కాంబినేషన్లో సినిమాను సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ కదా నిర్మిస్తోంది అన్న సందేహం రాకుండా ఉండదు. అది నిజమే కానీ. ఈ ప్రాజెక్టులో రాజు కూడా భాసగ్వామి అవుతున్నాడనది తాజా సమాచారం.
కేఎల్ నారాయణ సినిమా నిర్మాణం పక్కన పెట్టేసి చాలా ఏళ్లయింది. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో బిజీ అయిపోయారు. కాకపోతే తాను నిర్మాగా యాక్టివ్గా ఉన్న సమయంలో తనకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాజమౌళి ఇప్పుడు సినిమా చేయడానికి ముందుకు రావడంతో మళ్లీ దుర్గా ఆర్ట్స్ దుమ్ము దులుపుతున్నారు. ఐతే ఆయన సినిమాలు చేసే టైంకి, ఇప్పటికి మొత్తం వ్యవహారం మారిపోయింది. ప్రొడక్షన్ అనే కాక సినిమా బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ అంతా మారాయి. దీనికి తోడు సినిమాకు బడ్జెట్ కూడా వందల కోట్లలో పెట్టాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో తానొక్కడినే ఈ సినిమాను హ్యాండిల్ చేయడం కష్టమన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ పరంగా తిరుగులేని స్థాయిలో ఉన్న దిల్ రాజును ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానించాడట నారాయణ. రాజమౌళి-మహేష్ కాంబినేషన్లో సినిమాలో భాగస్వామి అవమంటే రాజు ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాడు. వెంటనే ఓకే చెప్పేశాడని.. ఆయన కూడా ఈ ప్రాజెక్టులో పార్టనర్ అనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు.
This post was last modified on November 24, 2021 1:32 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…