నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. గత రెండేళ్లలో ఆయన నటించిన సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో ప్రేక్షకులను థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతున్నారు నాని. ప్రస్తుతం ఈ హీరో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తి కాకుండానే.. ‘దసరా’ అనే మరో సినిమాను మొదలుపెట్టారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది. ఈ సినిమా పోస్టర్ లో నాని రగ్డ్ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు.
తొలిసారి నాని ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో హీరోతో పాటు అతడి ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుందట. సినిమాకి ఆ పాత్ర చాలా కీలకమని చెబుతున్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు ఈ ఫ్రెండ్షిప్ బాండ్ మీదే ఉంటాయని సమాచారం. దీంతో ఆ పాత్రలో మరో యంగ్ హీరోని తీసుకుంటేనే కరెక్ట్ అని చిత్రబృందం భావిస్తోంది.
దీనికోసం ఇప్పటికే పేరున్న ఇద్దరు హీరోలను సంప్రదించారట. వారిద్దరిలో ఎవరైనా ఓకే చెబితే.. సినిమాకి మరో ఎట్రాక్షన్ యాడ్ అవుతుందని భావిస్తున్నారు. మరి నానితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ హీరో ముందుకొస్తారో చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ కనిపించనుంది. అలానే సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమా మ్యూజిక్ అందించనున్నారు.
This post was last modified on November 22, 2021 2:48 pm
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…