భీమ్లానాయక్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే సంకేతాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. సంక్రాంతి రిలీజ్ పక్కా అనే విషయాన్ని చిత్ర బృందం మళ్లీ మళ్లీ నొక్కి వక్కాణిస్తూనే ఉంది. ఐదు రోజుల కిందట కొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రెండు రోజుల తర్వాత పీఆర్ సంస్థలతో ఈ మేరకు ట్వీట్లు వేయించారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ హ్యాండిల్లో సినిమా ఎడిటింగ్ జరుగుతున్న గదిలో ఒక విజువల్ చూపిస్తూ సంక్రాంతి విడుదల పక్కా అన్న విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ సినిమాను వాయిదా వేయించడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్.. భీమ్లా నాయక్ టీంను కలుస్తున్నట్లు నాలుగైదు రోజుల కిందటే వార్తలు రావడం తెలిసిందే.
రాజు రంగంలోకి దిగాడంటే కచ్చితంగా పనైపోతుందనే అనుకున్నారు. కానీ ఎవ్వరేం చెప్పినా భీమ్లా నాయక్ టీం లొంగట్లేదని స్పష్టమవుతోంది.
సంక్రాంతి సీజన్ను వదులుకుంటే జరిగే నష్టమేంటో తెలిసే భీమ్లా నాయక్ టీం ఆ సీజన్లోనే సినిమాను రిలీజ్ చేయాలనే పట్టుదలకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. సంక్రాంతి సినిమాలకు ఎగ్జిబిటర్లు టికెట్ల రేట్లను ఎలా పెంచుకున్నా తాము జోక్యం చేసుకోబోమంటూ ఏపీ మంత్రి పేర్ని నాని ఇటీవల పేర్కొన్నట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలో టికెట్ల రేట్ల గొడవ మొదలైందే పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్తో. అప్పట్నుంచి నిర్మాతలు కిందా మీదా పడుతున్నారు. వాళ్లు వేడుకున్నా.. పవన్ హెచ్చరించినా అక్కడ పరిస్థితి మారలేదు. కొత్తగా తెస్తున్న ఆన్ లైన్ టికెటింగ్ యాప్ రెడీ అయ్యాక కానీ టికెట్ల రేట్లు రివైజ్ చేసే అవకాశం లేదట.
ఐతే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి భారీ, పాన్ ఇండియా సినిమాలు రిలీజవుతుండటంతో ఆ చిత్ర బృందాలు ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తెచ్చో, లీగల్గా ట్రై చేసో టికెట్ల రేట్లు పెంచుకోవడం పక్కా అనే అంచనాలున్నాయి. పవన్ సినిమా సోలోగో వస్తే మరోసారి జగన్ ప్రభుత్వం దాన్ని టార్గెట్ చేయొచ్చు. అందుకే సంక్రాంతికి వస్తే అందరికీ కామన్గా ఒకే విధానం ఉంటుంది, సంక్రాంతి వరకు టికెట్ల రేట్లను పెంచుకునే సౌలభ్యం కల్పిస్తే భీమ్లా నాయక్కు కూడా ఆ అవకాశం దక్కుతుంది. అందుకే సంక్రాంతి రిలీజ్ విషయంలో భీమ్లా నాయక్ టీం తగ్గట్లేదని స్పష్టమవుతోంది.
This post was last modified on November 22, 2021 9:28 am
హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. దీంతో…
శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు.…
ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…
ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని…
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…
అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకున్న ఎల్2 ఎంపురాన్ కంటెంట్ గురించి అభ్యంతరాలు తలెత్తి దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి…