టాలీవుడ్లో ఐటెం సాంగ్లకు ఒక స్థాయి తీసుకొచ్చిన ఘనత సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ జోడీకే దక్కుతుంది. సుకుమార్ ఎలాంటి సినిమా తీసినా సరే.. అందులో ఒక ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్ మూవీలో సైతం ఐటెం సాంగ్ పెట్టాడంటే సుకుమార్కు ఆ తరహా పాటలపై ఉన్న మక్కువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అది ఆయనకో సెంటిమెంటు లాగా మారిపోయింది. సుకుమార్ కొత్త చిత్రం ‘పుష్ప’లో సైతం సుక్కు ఈ సెంటిమెంటును కొనసాగిస్తున్నాడు.
ఇప్పటికే ‘పుష్ప’ నుంచి నాలుగు పాటలు రిలీజ్ కాగా.. వేటికవే మంచి ఆదరణ తెచ్చుకున్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఆ పాటలు మోత మోగించేస్తున్నాయి. టీవీ షోల్లో ఎక్కువగా ఈ పాటలనే పెర్ఫామ్ చేస్తుండటం అవి ఏ స్థాయిలో ఆదరణ పొందాయో చెప్పడానికి రుజువు. సినిమాలో మొత్తం ఉన్నవి ఐదు పాటలు కాగా.. ఇక మిగిలింది ఐటెం సాంగే.
‘పుష్ప’ ఐటెం సాంగ్లో సమంత మెరవబోతుండటం తెలిసిన విషయమే. ఈ నెల 26న రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ మొదలు కాబోతోంది. నాలుగు రోజుల పాటు దీన్ని షూట్ చేస్తారని సమాచారం. టాకీ పార్ట్తో పాటు మిగతా పాటల చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాడు సుక్కు. ఈ పాట అవ్వగానే గుమ్మడికాయ కొట్టేయబోతున్నాడు. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం సుక్కు-దేవి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ఐటెం సాంగ్స్కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ పాట ఉంటుందట.
వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన పాటల్లో మాదిరే ఇందులో ఒక కాన్సెప్ట్ ఉంటుందట. పాట మొత్తం ఐటెం గర్ల్ కొంటెగా ప్రశ్నలు సంధిస్తూ వెళ్లేలా ఈ పాటను రాశారట చంద్రబోస్. ఒక ప్రశ్న సంధించి.. ‘ఊ అంటావా.. ఊహూ అంటావా మావా’ అని అడుగుతూ సాగేలా పాట ఉంటుందట. మంచి హస్కీ వాయిస్ ఉన్న సింగర్ ఈ పాట పాడినట్లు సమాచారం. మధ్య వరకు ఒక మోస్తరుగా సాగి.. మంచి ఊపుతో పాట ముగుస్తుందని.. ఈ పాట కచ్చితంగా ఒక సెన్సేషన్ అవుతుందని అంటున్నాయి.
This post was last modified on November 21, 2021 3:41 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…