టాలీవుడ్లో ఐటెం సాంగ్లకు ఒక స్థాయి తీసుకొచ్చిన ఘనత సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ జోడీకే దక్కుతుంది. సుకుమార్ ఎలాంటి సినిమా తీసినా సరే.. అందులో ఒక ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్ మూవీలో సైతం ఐటెం సాంగ్ పెట్టాడంటే సుకుమార్కు ఆ తరహా పాటలపై ఉన్న మక్కువ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అది ఆయనకో సెంటిమెంటు లాగా మారిపోయింది. సుకుమార్ కొత్త చిత్రం ‘పుష్ప’లో సైతం సుక్కు ఈ సెంటిమెంటును కొనసాగిస్తున్నాడు.
ఇప్పటికే ‘పుష్ప’ నుంచి నాలుగు పాటలు రిలీజ్ కాగా.. వేటికవే మంచి ఆదరణ తెచ్చుకున్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఆ పాటలు మోత మోగించేస్తున్నాయి. టీవీ షోల్లో ఎక్కువగా ఈ పాటలనే పెర్ఫామ్ చేస్తుండటం అవి ఏ స్థాయిలో ఆదరణ పొందాయో చెప్పడానికి రుజువు. సినిమాలో మొత్తం ఉన్నవి ఐదు పాటలు కాగా.. ఇక మిగిలింది ఐటెం సాంగే.
‘పుష్ప’ ఐటెం సాంగ్లో సమంత మెరవబోతుండటం తెలిసిన విషయమే. ఈ నెల 26న రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ మొదలు కాబోతోంది. నాలుగు రోజుల పాటు దీన్ని షూట్ చేస్తారని సమాచారం. టాకీ పార్ట్తో పాటు మిగతా పాటల చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాడు సుక్కు. ఈ పాట అవ్వగానే గుమ్మడికాయ కొట్టేయబోతున్నాడు. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం సుక్కు-దేవి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ఐటెం సాంగ్స్కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ పాట ఉంటుందట.
వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన పాటల్లో మాదిరే ఇందులో ఒక కాన్సెప్ట్ ఉంటుందట. పాట మొత్తం ఐటెం గర్ల్ కొంటెగా ప్రశ్నలు సంధిస్తూ వెళ్లేలా ఈ పాటను రాశారట చంద్రబోస్. ఒక ప్రశ్న సంధించి.. ‘ఊ అంటావా.. ఊహూ అంటావా మావా’ అని అడుగుతూ సాగేలా పాట ఉంటుందట. మంచి హస్కీ వాయిస్ ఉన్న సింగర్ ఈ పాట పాడినట్లు సమాచారం. మధ్య వరకు ఒక మోస్తరుగా సాగి.. మంచి ఊపుతో పాట ముగుస్తుందని.. ఈ పాట కచ్చితంగా ఒక సెన్సేషన్ అవుతుందని అంటున్నాయి.
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…