సంక్రాంతి వస్తోందంటే సాధారణంగా స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజుకి రెడీ అయిపోతాయి. ఒకదాని తర్వాత ఒకరుగా కర్చీఫ్ వేసేస్తాయి. ఈసారి కూడా అదే జరిగింది. కానీ ఎప్పుడైతే ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఆ సీజన్కే ఫిక్సయ్యిందో.. మిగతావారి లెక్కలు మారిపోయాయి. సర్కారువారి పాట, ఎఫ్ 3 తమ డేట్స్ మార్చేసుకున్నాయి. ప్రస్తుతానికి రాధేశ్యామ్, భీమ్లానాయక్ మాత్రమే అనుకున్న తేదీకి ఫిక్సై ఉన్నాయి.
అయితే వీరితో పాటు బంగార్రాజు కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాడనే వార్త కొద్ది రోజులుగా వినిపిస్తోంది. కాకపోతే ప్యాన్ ఇండియా సినిమాల మధ్యలో ఈ అచ్చ తెలుగు మూవీ పోటీకి వస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది. కానీ నాగార్జున దానికే బలంగా ఫిక్సయ్యారనే ప్రచారం జరుగుతోంది. అది నిజమేనేమోనని ఇప్పుడనిపిస్తోంది. ఎందుకంటే వరుస అప్డేట్స్తో టీమ్ తమ జోరు చూపిస్తోంది.
రీసెంట్గా నాగార్జున దేవకన్యలతో ఆడిపాడుతున్న పాటను రిలీజ్ చేశారు. ఆ వెంటనే నాగచైతన్యకి జోడీగా నటిస్తున్న కృతీశెట్టి ఫస్ట్ లుక్ను వదిలారు. త్వరలో మరో రెండు అప్డేట్స్ ఇవ్వబోతున్నట్టు ఇప్పుడు ప్రకటించారు. ఈ నెల 22న బంగార్రాజు ఫస్ట్ లుక్ను, 23న టీజర్ను రిలీజ్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ నాగార్జున లుక్ని అందరూ చూసేశారు కాబట్టి ఈసారి వచ్చే లుక్ నాగచైతన్యదే కావచ్చు.
ఈ స్పీడ్లో అప్డేట్స్ ఇస్తున్నారంటే కచ్చితంగా సినిమాని సంక్రాంతి రేసులో నిలబెడతారనే అనిపిస్తోంది. అయినా ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమానే. సంక్రాంతి అంటేనే ఊరు గుర్తొస్తుంది ఎవరికైనా. ఇది అచ్చమైన పల్లెటూరి స్టోరీ. కాబట్టి బంగార్రాజు బరిలోకి దిగాలనుకోవడం తప్పేమీ లేదు. కానీ ఒకేసారి పెద్ద సినిమాలన్నీ వస్తే థియేటర్లకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా సైతం పక్కకి తప్పుకుంది. మరి ఆ సమస్య బంగార్రాజుకి మాత్రం రాదా అనేదే ప్రశ్న.
This post was last modified on November 20, 2021 11:48 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…