నందమూరి కుటుంబ హీరోల్లో ఏ ఇద్దరు ఒక చోట కలిసి కనిపించినా అందరూ ప్రత్యేక ఆసక్తితో చూస్తారు. కారణాలేవైనా కానీ.. నందమూరి కుటుంబ హీరోల్లో ఉండాల్సినంత సఖ్యత లేదన్నది వాస్తవం. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. ఏవో కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే దూరం దూరంగానే ఉన్నారు. గతంలో కళ్యాణ్ రామ్.. బాలయ్యకు దగ్గరగా ఉండేవాడు. తారక్కు, కళ్యాణ్కు అంత సాన్నిహిత్యం కనిపించేది కాదు. తర్వాత పరిస్థితులు మారాయి. అన్నదమ్ములిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. బాలయ్యకు, తారక్కు దూరం ఇంకా ఇంకా పెరిగింది.
మూడేళ్ల కిందట హరికృష్ణ చనిపోయినపుడు.. అరవింద సమేత సక్సెస్ మీట్లో బాలయ్య, తారక్ కలిసి కనిపించారు. ఆ తర్వాత ‘యన్.టి.ఆర్’ సినిమా వేడుకలో తారక్ పాల్గొన్నాడు. తర్వాత ఇద్దరూ దూరం దూరంగానే ఉన్నారు. సినిమా పరంగానే కాక వేరే రకమైన వేడుకల్లో కూడా కలిసి కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి.
ఐతే చాన్నాళ్ల తర్వాత బాబాయ్-అబ్బాయ్ కలిసి ఒకే వేదికలో కనిపించనున్నట్లుగా ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ ప్రి రిలీజ్ ఈవెంట్కు తారక్ అతిథిగా రాబోతున్నాడట. తారక్ సినిమాకు బాలయ్య ముఖ్య అతిథి అంటే ఒక లెక్క కానీ.. బాలయ్య చిత్రానికి తారక్ చీఫ్ గెస్ట్ అంటే అది కచ్చితంగా పెద్ద చర్చనీయాంశమే. ఈ వేడుకలో నేచురల్ స్టార్ నాని కూడా పాల్గొంటాడని కూడా వార్తలొస్తున్నాయి. నాని ఇటీవలే బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు అతిథిగా రావడం తెలిసిందే.
ఐతే క్రేజీగా ఉంటుందని ఊరికే తారక్, నాని.. బాలయ్య సినిమాకు గెస్ట్స్ అని సోషల్ మీడియాలో జనాలు ప్రచారం సాగిస్తున్నారా.. లేక నిజంగానే వీళ్లిద్దరూ ఈ వేడుకలో పాల్గొంటారా అన్నది చూడాలి. ఈ నెల 27న ‘అఖండ’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 20, 2021 12:07 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…