ఇంకో ఐదు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది విక్టరీ వెంకటేష్ మూవీ ‘దృశ్యం-2’. మలయాళంలో ఇదే పేరుతో తెరకెక్కిన ‘దృశ్యం’ సీక్వెల్కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే రిలీజ్ ముంగిట ఈ చిత్రానికి లీగల్ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. గుట్టుగా సమస్యను పరిష్కరించుకోవడమో లేక రిలీజ్ ఆపేయడమో చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘దృశ్యం-2’ చిత్రం ఓటీటీ రిలీజవుతుందన్న సమాచారం చాలా రోజుల ముందే బయటికి వచ్చింది.
ఐతే అప్పుడు ఆ చిత్రాన్ని డిస్నీ+హాట్ స్టార్ వాళ్లు కొన్నట్లుగా వార్తలొచ్చాయి. మీడియాలో కొన్ని రోజుల పాటు హాట్ స్టార్ పేరే వినిపించింది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి అమేజాన్ ప్రైమ్ పేరు తెరపైకి వచ్చింది. ‘దృశ్యం-2’ ఒరిజినల్ను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసిన ప్రైమ్ వాళ్లే మళ్లీ తెలుగు ‘దృశ్యం-2’ను కూడా విడుదల చేస్తుండటం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఐతే ప్రిమియర్స్ డేట్ ఇచ్చేసి ప్రమోషన్లు మొదలుపెట్టడంతో సినిమా వీక్షణకు అంతా రెడీ అయిపోయారు. కానీ ఇప్పుడు హాట్ స్టార్ సంస్థ లైన్లోకి వచ్చింది. ముందు తమతో డీల్ చేసుకుని.. దాన్ని క్యాన్సిల్ చేయకుండానే మధ్యలో ప్రైమ్కు వెళ్లిపోవడం పట్ల ఆ సంస్థ ఆగ్రహంతో ఉందని, దీనిపై లీగల్ నోటీసులు ఇచ్చిందని సమచారం.
‘దృశ్యం-2’కు సంబంధించి సురేష్ బాబుతో పాటు ఇంకో ఇద్దరు నిర్మాతలు ఉండగా.. వారిలో ఒకరు హాట్ స్టార్ వాళ్లతో డీల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ డీల్ సంగతి ఎటూ తేలకముందే తన ప్రొడక్షన్లో వచ్చిన మరో చిత్రం ‘నారప్ప’ సినిమాను రిలీజ్ చేసిన ప్రైమ్ వాళ్లతో సురేష్ బాబు ‘దృశ్యం-2’ విడుదలకు ఒప్పందం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో హాట్ స్టార్ వాళ్లకు మండిపోయి లీగల్ ఫైట్కు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. రిలీజ్కు ఇంకో ఐదు రోజులే ఉండగా ఈ సమస్యను సురేష్ బాబు ఎలా పరిష్కరిస్తారో.. సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో చూడాలి.
This post was last modified on November 19, 2021 10:01 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…