ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన ‘మానాడు’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఓ ఈవెంట్ లో శింబు మాట్లాడుతూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పారు. వెంకటేష్ ప్రభుతో చాలా రోజులుగా సినిమా చేయాలనుకున్నానని.. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమైందని చెప్పారు.
ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి కొదవ ఉందని.. ఈ సినిమాతో తన రేంజ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు సినిమా గురించి సరదాగా మాట్లాడిన శింబు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనను కొందరు కావాలనే టార్గెట్ చేశారని.. ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఏడవడంతో వెంటనే పక్కన ఉన్న క్రూ మెంబర్స్ ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి తేరుకొని.. ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని.. తన సంగతి మాత్రం అభిమానులు చూసుకోవాలని కోరారు.
ఈ మధ్యకాలంలో శింబుకి ఒక్క హిట్టు కూడా పడలేదు. సినిమాల్లేక ఇబ్బంది పడ్డారు. పెర్సనల్, ప్రొఫెషనల్ జీవితాలకు సంబంధించి పలు వివాదాల్లో శింబు పేరు వినిపించింది. ఇండస్ట్రీలో కూడా కొందరితో గొడవ పడడం, టైంకి షూటింగ్ కి రాకపోవడంతో వంటి కారణాలతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆయనపై ఫైర్ అవుతూ.. కొంతకాలంపాటు నిషేధించింది. ఫైనల్ గా అన్ని స్ట్రగుల్స్ ను దాటుకొని తన కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ హీరో.
This post was last modified on November 19, 2021 12:32 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…