Movie News

కావాలనే టార్గెట్ చేశారని.. స్టేజ్ పై ఏడ్చేసిన హీరో!

ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన ‘మానాడు’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఓ ఈవెంట్ లో శింబు మాట్లాడుతూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పారు. వెంకటేష్ ప్రభుతో చాలా రోజులుగా సినిమా చేయాలనుకున్నానని.. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమైందని చెప్పారు.

ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి కొదవ ఉందని.. ఈ సినిమాతో తన రేంజ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు సినిమా గురించి సరదాగా మాట్లాడిన శింబు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనను కొందరు కావాలనే టార్గెట్ చేశారని.. ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఏడవడంతో వెంటనే పక్కన ఉన్న క్రూ మెంబర్స్ ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి తేరుకొని.. ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని.. తన సంగతి మాత్రం అభిమానులు చూసుకోవాలని కోరారు.

ఈ మధ్యకాలంలో శింబుకి ఒక్క హిట్టు కూడా పడలేదు. సినిమాల్లేక ఇబ్బంది పడ్డారు. పెర్సనల్, ప్రొఫెషనల్ జీవితాలకు సంబంధించి పలు వివాదాల్లో శింబు పేరు వినిపించింది. ఇండస్ట్రీలో కూడా కొందరితో గొడవ పడడం, టైంకి షూటింగ్ కి రాకపోవడంతో వంటి కారణాలతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆయనపై ఫైర్ అవుతూ.. కొంతకాలంపాటు నిషేధించింది. ఫైనల్ గా అన్ని స్ట్రగుల్స్ ను దాటుకొని తన కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ హీరో.

This post was last modified on November 19, 2021 12:32 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

10 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

11 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

12 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

13 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

13 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

14 hours ago