Movie News

కావాలనే టార్గెట్ చేశారని.. స్టేజ్ పై ఏడ్చేసిన హీరో!

ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన ‘మానాడు’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఓ ఈవెంట్ లో శింబు మాట్లాడుతూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పారు. వెంకటేష్ ప్రభుతో చాలా రోజులుగా సినిమా చేయాలనుకున్నానని.. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమైందని చెప్పారు.

ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి కొదవ ఉందని.. ఈ సినిమాతో తన రేంజ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు సినిమా గురించి సరదాగా మాట్లాడిన శింబు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనను కొందరు కావాలనే టార్గెట్ చేశారని.. ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఏడవడంతో వెంటనే పక్కన ఉన్న క్రూ మెంబర్స్ ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి తేరుకొని.. ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని.. తన సంగతి మాత్రం అభిమానులు చూసుకోవాలని కోరారు.

ఈ మధ్యకాలంలో శింబుకి ఒక్క హిట్టు కూడా పడలేదు. సినిమాల్లేక ఇబ్బంది పడ్డారు. పెర్సనల్, ప్రొఫెషనల్ జీవితాలకు సంబంధించి పలు వివాదాల్లో శింబు పేరు వినిపించింది. ఇండస్ట్రీలో కూడా కొందరితో గొడవ పడడం, టైంకి షూటింగ్ కి రాకపోవడంతో వంటి కారణాలతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆయనపై ఫైర్ అవుతూ.. కొంతకాలంపాటు నిషేధించింది. ఫైనల్ గా అన్ని స్ట్రగుల్స్ ను దాటుకొని తన కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ హీరో.

This post was last modified on November 19, 2021 12:32 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

5 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

8 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

8 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

8 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

9 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

9 hours ago