ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు కొందరు కావాలని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంకటేష్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా నటించిన ‘మానాడు’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఓ ఈవెంట్ లో శింబు మాట్లాడుతూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పారు. వెంకటేష్ ప్రభుతో చాలా రోజులుగా సినిమా చేయాలనుకున్నానని.. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమైందని చెప్పారు.
ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి కొదవ ఉందని.. ఈ సినిమాతో తన రేంజ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు సినిమా గురించి సరదాగా మాట్లాడిన శింబు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనను కొందరు కావాలనే టార్గెట్ చేశారని.. ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఏడవడంతో వెంటనే పక్కన ఉన్న క్రూ మెంబర్స్ ఓదార్చే ప్రయత్నం చేశారు. కాసేపటికి తేరుకొని.. ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని.. తన సంగతి మాత్రం అభిమానులు చూసుకోవాలని కోరారు.
ఈ మధ్యకాలంలో శింబుకి ఒక్క హిట్టు కూడా పడలేదు. సినిమాల్లేక ఇబ్బంది పడ్డారు. పెర్సనల్, ప్రొఫెషనల్ జీవితాలకు సంబంధించి పలు వివాదాల్లో శింబు పేరు వినిపించింది. ఇండస్ట్రీలో కూడా కొందరితో గొడవ పడడం, టైంకి షూటింగ్ కి రాకపోవడంతో వంటి కారణాలతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆయనపై ఫైర్ అవుతూ.. కొంతకాలంపాటు నిషేధించింది. ఫైనల్ గా అన్ని స్ట్రగుల్స్ ను దాటుకొని తన కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ హీరో.
This post was last modified on November 19, 2021 12:32 pm
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…