పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఎప్పట్నుంచో ఆశ ఉంది. అతడికి తెలుగు రాష్ట్రాల అవతల మంచి ఫాలోయింగే ఉంది. డబ్బింగ్ సినిమాలతో ఓపక్క కేరళలో.. మరోపక్క నార్త్ ఇండియాలో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. కన్నడ నాట ఎప్పడూ తెలుగు స్టార్లకు మంచి ఆదరణే ఉంటుంది.
దక్షిణాదిన బన్నీకి కొంచెం ఆదరణ తక్కువున్న రాష్ట్రం అంటే తమిళనాడునే. అక్కడ మార్కెట్ పెంచుకునే దిశగా బన్నీ ఇప్పుడు కీలక ముందడుగు వేస్తున్నాడు. అతడి కొత్త చిత్రం పుష్ప తమిళంలో కూడా పెద్ద ఎత్తునే రిలీజ్ కాబోతోంది. పుష్ప తమిళ హక్కులు అక్కడి అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చేతికి వెళ్లడం విశేషం.
కత్తి, 2.0, ఇండియన్-2 లాంటి భారీ చిత్రాలతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ల్లో ఒకటిగా కొనసాగుతోంది లైకా. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేస్తోంది కూడా లైకా వాళ్లే. అలాంటి పెద్ద నిర్మాణ సంస్థ పుష్ప మూవీని రిలీజ్ చేస్తోందంటే దీని రీచ్ వేరే లెవెల్లో ఉంటుందనడంలో సందేహం లేదు.
ఫాహద్ ఫాజిల్, రష్మిక మందన్నా లాంటి నటులు తమిళ ప్రేక్షకులకు బాగానే పరిచయం. పుష్ప మూవీ మీద అక్కడ కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అక్కడ ఇప్పటికే పుష్పను అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు. పీఆర్వోలు సోషల్ మీడియా ద్వారా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా అని బన్నీ నమ్ముతుండటం, లైకా వాళ్లు తోడవడంతో పుష్పతో బన్నీకి తమిళనాట మంచి మార్కెట్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 18, 2021 9:11 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…