Movie News

అర్జున ఫల్గుణ.. అందుకే ట్రెండింగ్

డిఫరెంట్ కాన్సెప్టులు తప్ప రొటీన్ సినిమాలు చేయడానికి ఇష్టపడడు శ్రీవిష్ణు. హీరోయిజం కోసం పాకులాడకుండా.. తన ఇమేజ్కి తగ్గ పాత్రల్నే ఎంచుకుంటాడు. అలాగని ఏదో ఒక కథ కాకుండా కాస్తో కూస్తో కొత్తగా ఉండేవే సెలెక్ట్ చేసుకుంటాడు. అందుకే నటుడిగా తనకి మంచి పేరుంది. తేజ మార్ని డైరెక్షన్‌లో చేస్తున్న ‘అర్జున ఫల్గుణ’ సినిమా కూడా శ్రీవిష్ణు స్టైల్లోనే డిఫరెంట్‌గా కనిపిస్తోంది.

రీసెంట్‌గా ఈ మూవీ టీజర్, సాంగ్ రిలీజయ్యాయి. అవి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. శ్రీవిష్ణు గత సినిమాలను మించి ఈ మూవీ అప్‌డేట్స్‌ వైరల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే దానికి కారణం ఎన్టీఆర్‌‌ అభిమానులే అంటున్నారు ఇండస్ట్రీ వారు. శ్రీవిష్ణు సినిమాకి, ఎన్టీఆర్‌‌ ఫ్యాన్స్‌కి లింకేంటా అనేగా! ఉంది. ఈ మూవీలో ఎన్టీఆర్‌‌కి వీరాభిమానిగా నటిస్తున్నాడు శ్రీవిష్ణు. తన సినిమాల రిలీజులకి హడావుడి చేయడం, కటౌట్లకి అభిషేకాలు చేయడం లాంటి సీన్లు కూడా ఉన్నాయట. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ పేరు కూడా వాడతాడట.

ఈ విషయాలన్నీ బయటికి రావడం, షూటింగ్ సమయంలోని కొన్ని ఫొటోలు కూడా లీక్ అవడంతో ఈ మూవీపై ఎన్టీఆర్ అభిమానుల దృష్టి పడింది. తమ ఫేవరేట్ హీరో ప్రస్తావన ఉన్న సినిమా కాబట్టి బాగా ప్రమోట్ చేయాలని వాళ్లు డిసైడ్ అయ్యారట. అందుకే ఈ మూవీ నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా వైరల్ చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. మరి ఎన్టీఆర్ సెంటిమెంట్ సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

This post was last modified on November 17, 2021 2:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

30 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

50 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago