ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇచ్చే ‘నంది’ అవార్డులను సినీ జనాలు ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావించేవారో తెలిసిందే. సినిమా విజయం సాధిస్తే ఎంత ఆనందపడేవారో.. నంది అవార్డులొస్తే దానికి మించిన ఆనందం కనిపించేది. నంది పురస్కారం సాధిస్తే దాన్ని కెరీర్లోనే గొప్ప ఘనతగా భావించేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోగానే పరిస్థితులు మారిపోయాయి.
సినీ పరిశ్రమకు కేంద్రమైన హైదరాబాద్ ఉన్నది తెలంగాణలో. ఐతే ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం నంది అవార్డుల గురించి ఏమీ పట్టనట్లు ఉండిపోయింది. ఒక సందర్భంలో నంది అవార్డుల గురించి విలేకరులు అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తేలిక చేసి మాట్లాడారు. ఆయన ప్రభుత్వం ఈ అవార్డులను అస్సలు పట్టించుకునే పరిస్థితి లేదు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నేళ్ల గ్యాప్ తర్వాత నంది అవార్డులను ప్రకటించింది కానీ.. అందులో పక్షపాతం ప్రదర్శించారన్న విమర్శలు రావడంతో తర్వాతి ఏడాది అవార్డులను ఆపేసింది. ఇక ఆ తర్వాత నంది పురస్కారాల ఊసే లేకపోయింది.
ప్రతి రాష్ట్రం తమ సినీ కళాకారుల ప్రతిభను గుర్తించి పురస్కారాలు అందిస్తోంది కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినీ జనాలకు ఇందుకు నోచుకోవడం లేదు. ఒకటీ అరా వచ్చే జాతీయ అవార్డుల వైపు ఆశగా చూస్తున్నారు. ఫిలిం ఫేర్, సైమా లాంటి అవార్డులతో సంతృప్తి పడుతున్నారు. దీని పట్ల మెగాస్టార్ చిరంజీవి కొంత ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నంది అవార్డులను ఆపేయడం బాధాకరమంటూ ఒక ప్రైవేటు అవార్డుల వేడుకలో చిరు బాధ పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పురస్కారాలను సినీ కళాకారులు చాలా ప్రత్యేకంగా భావిస్తారని.. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి.. పురస్కారాలు అందించి ప్రోత్సహించాలని ఆయన కోరారు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…