‘అందాల రాక్షసి’లో లావణ్య త్రిపాఠిని చూసి ఎంతోమంది కుర్రాళ్ల హృదయాలు లయ తప్పాయి. ఆమె వాళ్లందరికీ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా లావణ్య మాత్రం అందరికీ నచ్చేసింది. రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లు భిన్నమైన టిపికల్ అందం, అభినయంతో ఆమె ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత లావణ్యకు అవకాశాలైతే బాగానే వచ్చాయి కానీ.. ఇన్నేళ్లలో ఆమె ఎప్పుడూ ఒక స్థాయిని మించి మాత్రం ఎదగలేకపోయింది.
ఎప్పుడూ మిడ్ రేంజ్ హీరోలకు జోడీగానే నటించింది తప్ప.. బడా స్టార్లతో జోడీ కట్టలేదు. పెద్ద దర్శకులు కూడా ఆమెకు అంతగా అవకాశాలు ఇవ్వలేదు. ఇంతకుముందు మీడియం రేంజ్లో అయినా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయేది కానీ.. ఈ మధ్య ఆ ఛాన్సులు కూడా తగ్గిపోయాయి.
ఈ ఏడాది ఎ1 ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాల్లో కనిపించిన లావణ్యకు ఆ రెండూ నిరాశనే మిగిల్చాయి. దీంతో లావణ్య కెరీర్ ఇక క్లోజ్ అయిపోయినట్లే అన్న నిర్ణయానికి వచ్చేశారందరూ. కానీ ఆమెకు ఇప్పుడో భారీ చిత్రంలో అవకాశం దక్కినట్లుగా వార్తలొస్తున్నాయి. అది మహేష్ బాబు-త్రివిక్రమ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కావడం విశేషం.
ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ కథానాయికగా ఖరారైన సంగతి తెలిసిందే. రెండో హీరోయిన్గా లావణ్యకు ఛాన్స్ ఇచ్చాడట త్రివిక్రమ్. ఇంతకుముందులా మీడియం రేంజ్ సినిమాల్లోనే అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న లావణ్యకు ఇంత పెద్ద సినిమాలో ఛాన్స్ అంటే ఆమె ఆనందానికి అవధులుండవు. రెండో హీరోయిన్గా అయినా సరే.. ఆమెకిది కెరీర్లోనే బిగ్గెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. మరి ఈ వార్త నిజమో కాదో చూడాలి.
This post was last modified on November 16, 2021 1:45 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…