బంగారం, వాన లాంటి సినిమాల్లో నటించిన ఉత్తరాది హీరోయిన్ మీరా చోప్రాకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య అనుకోకుండా తలెత్తిన వివాదం చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తారక్ ఎవరో తెలియదన్నందుకు తనను బూతులు తిట్టిన అతడి అభిమానులపై పోలీసులకు, జాతీయ మహిళా కమిషన్ అధికారులకే కాక.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణ మంత్రి కేటీఆర్కు కూడా ఫిర్యాదు చేసింది మీరా. దీనిపై పోలీసులు విచారణ కూడా జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులంతా మౌనం వహిస్తున్నారు. మీరాకు మద్దతుగా హీరోయిన్లు కూడా గళం విప్పలేదు. ఐతే ఎవ్వరూ ఊహించని విధంగా పూనమ్ కౌర్ ఈ వివాదంపై మాట్లాడింది.
ట్విట్టర్లో ఎప్పుడూ ఎలా స్పందిస్తుందో అర్థం కాని పూనమ్.. మీరా, తారక్ ఫ్యాన్స్ గొడవ విషయంలోనూ ఆశ్చర్యకర రీతిలోనే స్పందించింది. ఆమె మీరా వైపేమీ నిలబడలేదు. ఫ్యాన్స్ గురించి పాజిటివ్గా మాట్లాడింది. అలా అని మీరాను తిట్టిపోయడం కరెక్ట్ అనలేదు. ఫ్యాన్స్ అమాయకులని.. ఇలాంటి వ్యవహారాల్లో రాజకీయ ప్రయోజనాలతో కొందరు ఫేక్ అకౌంట్లు సృష్టించి అవతలి వాళ్ల మీద విషం చిమ్ముతారని.. తద్వారా హీరోలకు, అభిమానులకు చెడ్డ పేరు తెచ్చేలా చూస్తారని అంది పూనమ్. తనను కూడా రాజకీయ ప్రయోజనాలతో కొందరు టార్గెట్ చేశారని.. ఐతే తాను అభిమానుల జోలికి వెళ్లకుండా ఇలాంటి కుట్రలకు కారణమైన మధ్యవర్తుల మీదే పోలీసులకు ఫిర్యాదు చేశానని అంది పూనమ్. మొత్తంగా చూస్తే మీరా వ్యవహారంలో తారక్ ఫ్యాన్స్ తప్పేమీ లేదు, కుట్ర పూరితంగా కొందరు ఫేక్ అకౌంట్లు సృష్టించి మీరాను టార్గెట్ చేశారు అన్నది పూనమ్ వాదనగా కనిపిస్తోంది.
This post was last modified on June 6, 2020 1:13 am
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…