బంగారం, వాన లాంటి సినిమాల్లో నటించిన ఉత్తరాది హీరోయిన్ మీరా చోప్రాకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య అనుకోకుండా తలెత్తిన వివాదం చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తారక్ ఎవరో తెలియదన్నందుకు తనను బూతులు తిట్టిన అతడి అభిమానులపై పోలీసులకు, జాతీయ మహిళా కమిషన్ అధికారులకే కాక.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణ మంత్రి కేటీఆర్కు కూడా ఫిర్యాదు చేసింది మీరా. దీనిపై పోలీసులు విచారణ కూడా జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులంతా మౌనం వహిస్తున్నారు. మీరాకు మద్దతుగా హీరోయిన్లు కూడా గళం విప్పలేదు. ఐతే ఎవ్వరూ ఊహించని విధంగా పూనమ్ కౌర్ ఈ వివాదంపై మాట్లాడింది.
ట్విట్టర్లో ఎప్పుడూ ఎలా స్పందిస్తుందో అర్థం కాని పూనమ్.. మీరా, తారక్ ఫ్యాన్స్ గొడవ విషయంలోనూ ఆశ్చర్యకర రీతిలోనే స్పందించింది. ఆమె మీరా వైపేమీ నిలబడలేదు. ఫ్యాన్స్ గురించి పాజిటివ్గా మాట్లాడింది. అలా అని మీరాను తిట్టిపోయడం కరెక్ట్ అనలేదు. ఫ్యాన్స్ అమాయకులని.. ఇలాంటి వ్యవహారాల్లో రాజకీయ ప్రయోజనాలతో కొందరు ఫేక్ అకౌంట్లు సృష్టించి అవతలి వాళ్ల మీద విషం చిమ్ముతారని.. తద్వారా హీరోలకు, అభిమానులకు చెడ్డ పేరు తెచ్చేలా చూస్తారని అంది పూనమ్. తనను కూడా రాజకీయ ప్రయోజనాలతో కొందరు టార్గెట్ చేశారని.. ఐతే తాను అభిమానుల జోలికి వెళ్లకుండా ఇలాంటి కుట్రలకు కారణమైన మధ్యవర్తుల మీదే పోలీసులకు ఫిర్యాదు చేశానని అంది పూనమ్. మొత్తంగా చూస్తే మీరా వ్యవహారంలో తారక్ ఫ్యాన్స్ తప్పేమీ లేదు, కుట్ర పూరితంగా కొందరు ఫేక్ అకౌంట్లు సృష్టించి మీరాను టార్గెట్ చేశారు అన్నది పూనమ్ వాదనగా కనిపిస్తోంది.
This post was last modified on June 6, 2020 1:13 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…