రీసెంట్గా ‘మాస్ట్రో’గా ఓటీటీలో పలకరించిన నితిన్.. ఈసారి థియేటర్స్కే రావడానికి రెడీ అయ్యాడు. ఎం.ఎస్.రాజశేఖరరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజే చేయబోతున్నాడు. ఏప్రిల్ 29న ఈ పొలిటికల్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా కూడా రిలీజ్ కానుండటం విశేషం.
పవన్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. అదే రోజు నితిన్ కూడా రావడానికి ముహూర్తం పెట్టుకోవడం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి నితిన్ వీరాభిమాని. ఆయనపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచే ఏ సందర్భాన్నీ తను వదులుకోడు. అలాంటిది తన ఫేవరేట్ హీరోతో పోటీకి ఎలా దిగుతున్నాడనేదే పెద్ద ప్రశ్న.
ఒకవేళ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ మారుతుందనే హింట్ ఏమైనా నితిన్ టీమ్కి అందిందా? లేక ఆరోజు వాళ్లు రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసిన సంగతిని వీళ్లు గమనించుకోలేదా? కారణం ఏదైనా నితిన్ అనౌన్స్మెంట్ మాత్రం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి నిర్ణయాలు మారొచ్చు. డేట్స్ అటూ ఇటూ అవ్వొచ్చు. వెయిట్ చేసి చూద్దాం.
This post was last modified on November 13, 2021 11:26 am
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…