రీసెంట్గా ‘మాస్ట్రో’గా ఓటీటీలో పలకరించిన నితిన్.. ఈసారి థియేటర్స్కే రావడానికి రెడీ అయ్యాడు. ఎం.ఎస్.రాజశేఖరరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజే చేయబోతున్నాడు. ఏప్రిల్ 29న ఈ పొలిటికల్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా కూడా రిలీజ్ కానుండటం విశేషం.
పవన్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. అదే రోజు నితిన్ కూడా రావడానికి ముహూర్తం పెట్టుకోవడం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి నితిన్ వీరాభిమాని. ఆయనపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచే ఏ సందర్భాన్నీ తను వదులుకోడు. అలాంటిది తన ఫేవరేట్ హీరోతో పోటీకి ఎలా దిగుతున్నాడనేదే పెద్ద ప్రశ్న.
ఒకవేళ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ మారుతుందనే హింట్ ఏమైనా నితిన్ టీమ్కి అందిందా? లేక ఆరోజు వాళ్లు రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసిన సంగతిని వీళ్లు గమనించుకోలేదా? కారణం ఏదైనా నితిన్ అనౌన్స్మెంట్ మాత్రం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి నిర్ణయాలు మారొచ్చు. డేట్స్ అటూ ఇటూ అవ్వొచ్చు. వెయిట్ చేసి చూద్దాం.
This post was last modified on November 13, 2021 11:26 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…