మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద పాత్రను పోషించడం ప్రారంభించిన దగ్గర నుంచి వెన్నంటి వుంటున్నది హీరో నాగార్జున. మొన్నటి మొన్న మంత్రి తలసానితో సమావేశంలో కూడా నాగ్ కీలకంగా వున్నారు.
ఇదిలా వుంటే ఈ నెల 9న ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ను ఇండస్ట్రీ పెద్దలు కలవబోతున్నారు. ఇప్పటికే కేసిఆర్ దగ్గరకు వెళ్లినపుడు కానీ, మెగాస్టార్ ఇంట్లో మీటింగ్ జరిగినపుడు కానీ బాలయ్యను పిలవలేదు. ఈ విషయమై బాలయ్య కూడా బాహాటంగా తన అసంతృప్తి వ్యక్తం చేసారు.
మరి ఆంధ్ర సిఎమ్ దగ్గరకు వెళ్లినపుడు అయినా బాలయ్యను పిలుస్తారా? అన్నది అనుమానం. బాలయ్యను పిలవడం అనివార్యం. ఎందుకంటే ఆయన ఆంధ్రలో ఎమ్మెల్యేగా కూడా వున్నారు. కానీ రావడం రాకపోవడం అన్నది బాలయ్య ఇష్టం.
కానీ బాలయ్య వస్తారని తెలిస్తే నాగార్జున వస్తారా? లేదా నాగార్జున వస్తారని తెలిస్తే బాలయ్య వస్తారా? అన్నది అనుమానమే. ఎందుకంటే బాలయ్యకు మెగాస్టార్ తో కంటే నాగ్ తోనే కాస్త వైరుధ్యం వుందన్నది ఇండస్ట్రీ టాక్.
పైగా తేదేపా ఎమ్మెల్యేగా జగన్ పై విమర్శలు చేసిన బాలయ్య ఇప్పుడు ఆయన దగ్గరకే ఇండస్ట్రీ సమస్యల ప్రస్తావనకు వెళ్తారా? అన్నది కూడా డవుటే. మొత్తం మీద బాలయ్య ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
This post was last modified on June 5, 2020 11:02 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…