మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద పాత్రను పోషించడం ప్రారంభించిన దగ్గర నుంచి వెన్నంటి వుంటున్నది హీరో నాగార్జున. మొన్నటి మొన్న మంత్రి తలసానితో సమావేశంలో కూడా నాగ్ కీలకంగా వున్నారు.
ఇదిలా వుంటే ఈ నెల 9న ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ను ఇండస్ట్రీ పెద్దలు కలవబోతున్నారు. ఇప్పటికే కేసిఆర్ దగ్గరకు వెళ్లినపుడు కానీ, మెగాస్టార్ ఇంట్లో మీటింగ్ జరిగినపుడు కానీ బాలయ్యను పిలవలేదు. ఈ విషయమై బాలయ్య కూడా బాహాటంగా తన అసంతృప్తి వ్యక్తం చేసారు.
మరి ఆంధ్ర సిఎమ్ దగ్గరకు వెళ్లినపుడు అయినా బాలయ్యను పిలుస్తారా? అన్నది అనుమానం. బాలయ్యను పిలవడం అనివార్యం. ఎందుకంటే ఆయన ఆంధ్రలో ఎమ్మెల్యేగా కూడా వున్నారు. కానీ రావడం రాకపోవడం అన్నది బాలయ్య ఇష్టం.
కానీ బాలయ్య వస్తారని తెలిస్తే నాగార్జున వస్తారా? లేదా నాగార్జున వస్తారని తెలిస్తే బాలయ్య వస్తారా? అన్నది అనుమానమే. ఎందుకంటే బాలయ్యకు మెగాస్టార్ తో కంటే నాగ్ తోనే కాస్త వైరుధ్యం వుందన్నది ఇండస్ట్రీ టాక్.
పైగా తేదేపా ఎమ్మెల్యేగా జగన్ పై విమర్శలు చేసిన బాలయ్య ఇప్పుడు ఆయన దగ్గరకే ఇండస్ట్రీ సమస్యల ప్రస్తావనకు వెళ్తారా? అన్నది కూడా డవుటే. మొత్తం మీద బాలయ్య ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…