మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద పాత్రను పోషించడం ప్రారంభించిన దగ్గర నుంచి వెన్నంటి వుంటున్నది హీరో నాగార్జున. మొన్నటి మొన్న మంత్రి తలసానితో సమావేశంలో కూడా నాగ్ కీలకంగా వున్నారు.
ఇదిలా వుంటే ఈ నెల 9న ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ను ఇండస్ట్రీ పెద్దలు కలవబోతున్నారు. ఇప్పటికే కేసిఆర్ దగ్గరకు వెళ్లినపుడు కానీ, మెగాస్టార్ ఇంట్లో మీటింగ్ జరిగినపుడు కానీ బాలయ్యను పిలవలేదు. ఈ విషయమై బాలయ్య కూడా బాహాటంగా తన అసంతృప్తి వ్యక్తం చేసారు.
మరి ఆంధ్ర సిఎమ్ దగ్గరకు వెళ్లినపుడు అయినా బాలయ్యను పిలుస్తారా? అన్నది అనుమానం. బాలయ్యను పిలవడం అనివార్యం. ఎందుకంటే ఆయన ఆంధ్రలో ఎమ్మెల్యేగా కూడా వున్నారు. కానీ రావడం రాకపోవడం అన్నది బాలయ్య ఇష్టం.
కానీ బాలయ్య వస్తారని తెలిస్తే నాగార్జున వస్తారా? లేదా నాగార్జున వస్తారని తెలిస్తే బాలయ్య వస్తారా? అన్నది అనుమానమే. ఎందుకంటే బాలయ్యకు మెగాస్టార్ తో కంటే నాగ్ తోనే కాస్త వైరుధ్యం వుందన్నది ఇండస్ట్రీ టాక్.
పైగా తేదేపా ఎమ్మెల్యేగా జగన్ పై విమర్శలు చేసిన బాలయ్య ఇప్పుడు ఆయన దగ్గరకే ఇండస్ట్రీ సమస్యల ప్రస్తావనకు వెళ్తారా? అన్నది కూడా డవుటే. మొత్తం మీద బాలయ్య ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
This post was last modified on June 5, 2020 11:02 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…