మల్లికా శెరావత్.. ఈ పేరు వింటేనే ఒకప్పుడు కుర్రకారు కలల్లోకి జారుకునేవారు. మర్డర్ లాంటి సినిమాల్లో సెక్సీ క్వీన్గా ఆమె చేసిన విన్యాసాలను ఎవ్వరూ మర్చిపోలేరు. అయితే ఒకే తరహా నటనని, పాత్రల్ని ప్రేక్షకులు ఎన్నాళ్లని చూస్తారు? బోర్ కొట్టడం మొదలైంది. మల్లిక కెరీర్ కూడా డల్ అవడం స్టార్ట్ అయ్యింది. ఎప్పడైనా ఓ సినిమా మాత్రమే చేసే పరిస్థితి వచ్చింది.
చివరగా 2019లో ‘బూ సబ్కీ ఫటేగీ’ అనే వెబ్ సిరీస్లో కనిపించింది మల్లిక. తర్వాత ఆమె ఊసే లేకపోవడంతో కెరీర్ అయిపోయింది అనుకున్నారంతా. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యి షాకిచ్చింది మల్లిక. వీసీ వడివుదయన్ అనే తమిళ దర్శకుడు ‘నాగమతి’ అనే ట్రైలింగ్యువల్ మూవీని ప్లాన్ చేశాడు. అందులో లీడ్ రోల్ చేస్తోంది మల్లిక. ఈ ప్రాజెక్టు గురించిన వివరాలు పోయినేడే బైటికి వచ్చాయి. కానీ ఆ తర్వాత దీని గురించిన సమాచారమేమీ లేకపోవడంతో ఆగిపోయి ఉంటుంది అనుకున్నారు. అయితే ఈ మూవీ నిన్న ముంబైలో మొదలైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది.
గతంలో ‘దశావతారం’లో ఓ పాత్రలో కనిపించింది మల్లిక. ఇప్పుడు టాలీవుడ్కి కూడా పరిచయమవడం ఆనందంగా ఉంది అంటోంది. ఒకేసారి మూడు భాషల్లో డైలాగ్స్ చెప్పడం ప్రాక్టీస్ చేస్తోందట. టైటిల్ని బట్టి ఇదేదో నాగిని కథ అని అర్థమవుతోంది. గతంలో ఇలాంటి సినిమా ఒకటి చేసిందామె. మళ్లీ అలాంటి కథంటే కాస్త రిస్కే. బేసిగ్గా మల్లిక సినిమా అంటే జనాలు ఏమేం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలిసిందే. కాకపోతే ఇప్పుడామె అంత ఫామ్లో లేదు. తనని మించిన హాట్ గాళ్స్ చాలామంది ఇండస్ట్రీని ఏలుతున్నారు. మరి దర్శకుడు మల్లికని ఎలా చూపించి ప్రేక్షకుల్ని కన్విన్స్ చేస్తాడో చూడాలి.
This post was last modified on November 12, 2021 1:36 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…