‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి పేరు సంపాదించింది కొత్తమ్మాయి ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాదీ అమ్మాయి నటన మీద మక్కువతో కాలేజీ రోజుల్లోనే థియేటర్స్ గ్రూప్స్లో చేరి.. అక్కడ ప్రతిభ చాటుకుని.. అనుకోకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ కళ్లల్లో పడి.. అతడి నిర్మాణంలో కేవీ అనుదీప్ రూపొందించిన ‘జాతిరత్నాలు’లో అవకాశం దక్కించుకుంది.
రెగ్యులర్ స్టార్ హీరోయిన్లకు భిన్నమైన లుక్, నటనతో ఆమె ప్రత్యేకంగా కనిపించింది ‘జాతిరత్నాలు’లో. ఈ సినిమాతో ఆమె దశ తిరిగిపోతుందన్న అంచనాలు కలిగాయి కానీ.. వెంటనే అవకాశాలు మాత్రం రాలేదు. రవితేజ సరసన ఓ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లు వార్తలొచ్చాయి కానీ.. అవి నిజం కాలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో చిన్న క్యామియో లాంటి రోల్ మినహాయిస్తే ఫరియా ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ అవకాశం అందుకోలేదు.
ఐతే ఎట్టకేలకు ఫరియాకు ఓ పేరున్న సినిమాలో అవకాశం దక్కినట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కబోయే ‘డి అండ్ డి’కి ఆమెనే కథానాయికగా ఎంచుకున్నారట. నిజానికి ఫరియా టాలెంటుకి ఇంతకంటే మంచి అవకాశమే దక్కాలి కానీ.. తనకు ఛాన్సులే రాని నేపథ్యంలో దీన్నే మహాప్రసాదం అనుకోవాలి. మంచు విష్ణు, శ్రీను వైట్ల పునర్వైభవం కోసం గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉండటంతో ఈ సినిమా హిట్టయి తన కెరీర్కు కూడా ఉపయోగపడుతుందని ఫరియా ఆశించవచ్చు.
విష్ణు-వైట్ల కలయికలో వచ్చిన ‘ఢీ’ పెద్ద హిట్ కాగా.. ఆ లైన్స్లోనే ఈ సినిమాను తీయబోతున్నారు. పేరు ఆ చిత్రాన్ని తలపించినా ఇది సీక్వెల్ కాదంటోంది చిత్ర బృందం. దీన్ని మంచు విష్ణునే స్వయంగా నిర్మించబోతున్నాడు.
This post was last modified on November 11, 2021 12:36 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…