గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్లో వరుసగా కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. గురువారం ఒక్క రోజే రెండు క్రేజీ సినిమాలకు విడుదల తేదీల ప్రకటన జరిగింది. అందులో ఒకటి ఖిలాడి కాగా.. ఇంకోటి పక్కా కమర్షియల్. ఫిబ్రవరి 11న మేజర్ మూవీ రిలీజవుతున్న రోజే… రవితేజ సినిమాను షెడ్యూల్ చేయడం తెలిసిందే.
ఇక పక్కా కమర్షియల్ సినిమాకు మార్చి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. మారుతితో భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ బేనర్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది. మారుతి స్టయిల్లో మంచి ఎంటర్టైనర్లాగా కనిపిస్తోందీ సినిమా. టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆ ఊపులోనే రిలీజ్ డేట్ ప్రకటించారు.
మార్చి నెలాఖరు నుంచి భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా వరుస కడుతుండగా.. కొంచెం ముందుగా పక్కా కమర్షియల్కు డేట్ ఎంచుకున్నారు. ఆ నెల మధ్య నుంచే వేసవి సందడి మొదలవుతుంది. ఒక రకంగా పక్కా కమర్షియల్తోనే వేసవి సందడి ఆరంభం కాబోతోందన్నమాట. ఇటీవల సీటీమార్తో గోపీచంద్ కాస్త ఉపశమనం పొందాడు.
ఈ సినిమా పెద్ద హిట్ కాదు కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నందుకుని గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాప్ పడకుండా చూసింది. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. టీజర్కు రెస్పాన్స్ కూడా బాగుంది. కాబట్టి ఈ సినిమాతో తాను కోరుకున్న హిట్ దక్కుతుందని గోపీచంద్ ఆశతో ఉన్నాడు. మారుతి మార్కు వినోదానికి తోడు.. గోపీచంద్ స్టయిల్ యాక్షన్ కూడా ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది పక్కా కమర్షియల్.
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…