గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్లో వరుసగా కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. గురువారం ఒక్క రోజే రెండు క్రేజీ సినిమాలకు విడుదల తేదీల ప్రకటన జరిగింది. అందులో ఒకటి ఖిలాడి కాగా.. ఇంకోటి పక్కా కమర్షియల్. ఫిబ్రవరి 11న మేజర్ మూవీ రిలీజవుతున్న రోజే… రవితేజ సినిమాను షెడ్యూల్ చేయడం తెలిసిందే.
ఇక పక్కా కమర్షియల్ సినిమాకు మార్చి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. మారుతితో భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ బేనర్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది. మారుతి స్టయిల్లో మంచి ఎంటర్టైనర్లాగా కనిపిస్తోందీ సినిమా. టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆ ఊపులోనే రిలీజ్ డేట్ ప్రకటించారు.
మార్చి నెలాఖరు నుంచి భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా వరుస కడుతుండగా.. కొంచెం ముందుగా పక్కా కమర్షియల్కు డేట్ ఎంచుకున్నారు. ఆ నెల మధ్య నుంచే వేసవి సందడి మొదలవుతుంది. ఒక రకంగా పక్కా కమర్షియల్తోనే వేసవి సందడి ఆరంభం కాబోతోందన్నమాట. ఇటీవల సీటీమార్తో గోపీచంద్ కాస్త ఉపశమనం పొందాడు.
ఈ సినిమా పెద్ద హిట్ కాదు కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నందుకుని గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాప్ పడకుండా చూసింది. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. టీజర్కు రెస్పాన్స్ కూడా బాగుంది. కాబట్టి ఈ సినిమాతో తాను కోరుకున్న హిట్ దక్కుతుందని గోపీచంద్ ఆశతో ఉన్నాడు. మారుతి మార్కు వినోదానికి తోడు.. గోపీచంద్ స్టయిల్ యాక్షన్ కూడా ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది పక్కా కమర్షియల్.
This post was last modified on November 11, 2021 9:39 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…