గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్లో వరుసగా కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. గురువారం ఒక్క రోజే రెండు క్రేజీ సినిమాలకు విడుదల తేదీల ప్రకటన జరిగింది. అందులో ఒకటి ఖిలాడి కాగా.. ఇంకోటి పక్కా కమర్షియల్. ఫిబ్రవరి 11న మేజర్ మూవీ రిలీజవుతున్న రోజే… రవితేజ సినిమాను షెడ్యూల్ చేయడం తెలిసిందే.
ఇక పక్కా కమర్షియల్ సినిమాకు మార్చి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. మారుతితో భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ బేనర్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది. మారుతి స్టయిల్లో మంచి ఎంటర్టైనర్లాగా కనిపిస్తోందీ సినిమా. టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆ ఊపులోనే రిలీజ్ డేట్ ప్రకటించారు.
మార్చి నెలాఖరు నుంచి భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా వరుస కడుతుండగా.. కొంచెం ముందుగా పక్కా కమర్షియల్కు డేట్ ఎంచుకున్నారు. ఆ నెల మధ్య నుంచే వేసవి సందడి మొదలవుతుంది. ఒక రకంగా పక్కా కమర్షియల్తోనే వేసవి సందడి ఆరంభం కాబోతోందన్నమాట. ఇటీవల సీటీమార్తో గోపీచంద్ కాస్త ఉపశమనం పొందాడు.
ఈ సినిమా పెద్ద హిట్ కాదు కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నందుకుని గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాప్ పడకుండా చూసింది. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. టీజర్కు రెస్పాన్స్ కూడా బాగుంది. కాబట్టి ఈ సినిమాతో తాను కోరుకున్న హిట్ దక్కుతుందని గోపీచంద్ ఆశతో ఉన్నాడు. మారుతి మార్కు వినోదానికి తోడు.. గోపీచంద్ స్టయిల్ యాక్షన్ కూడా ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది పక్కా కమర్షియల్.
This post was last modified on November 11, 2021 9:39 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…