గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్లో వరుసగా కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు. గురువారం ఒక్క రోజే రెండు క్రేజీ సినిమాలకు విడుదల తేదీల ప్రకటన జరిగింది. అందులో ఒకటి ఖిలాడి కాగా.. ఇంకోటి పక్కా కమర్షియల్. ఫిబ్రవరి 11న మేజర్ మూవీ రిలీజవుతున్న రోజే… రవితేజ సినిమాను షెడ్యూల్ చేయడం తెలిసిందే.
ఇక పక్కా కమర్షియల్ సినిమాకు మార్చి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. మారుతితో భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ బేనర్లోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది. మారుతి స్టయిల్లో మంచి ఎంటర్టైనర్లాగా కనిపిస్తోందీ సినిమా. టీజర్కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆ ఊపులోనే రిలీజ్ డేట్ ప్రకటించారు.
మార్చి నెలాఖరు నుంచి భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా వరుస కడుతుండగా.. కొంచెం ముందుగా పక్కా కమర్షియల్కు డేట్ ఎంచుకున్నారు. ఆ నెల మధ్య నుంచే వేసవి సందడి మొదలవుతుంది. ఒక రకంగా పక్కా కమర్షియల్తోనే వేసవి సందడి ఆరంభం కాబోతోందన్నమాట. ఇటీవల సీటీమార్తో గోపీచంద్ కాస్త ఉపశమనం పొందాడు.
ఈ సినిమా పెద్ద హిట్ కాదు కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నందుకుని గోపీచంద్ ఖాతాలో మరో ఫ్లాప్ పడకుండా చూసింది. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. టీజర్కు రెస్పాన్స్ కూడా బాగుంది. కాబట్టి ఈ సినిమాతో తాను కోరుకున్న హిట్ దక్కుతుందని గోపీచంద్ ఆశతో ఉన్నాడు. మారుతి మార్కు వినోదానికి తోడు.. గోపీచంద్ స్టయిల్ యాక్షన్ కూడా ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది పక్కా కమర్షియల్.
This post was last modified on November 11, 2021 9:39 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…