సినిమా బడ్జెట్, కలెక్షన్ల పరంగా బాహుబలితో ఏమాత్రం పోలిక లేని సూర్యవంశీ.. ఆ సినిమా రికార్డును ఎలా బద్దలు కొడుతుంది అని సందేహం కలుగుతోందా? నిజమే కలెక్షన్ల పరంగా బాహుబలితో దీనికి పోలిక లేదు. కానీ కరోనా ధాటికి అల్లాడిపోయిన బాలీవుడ్కు ఊపిరి పోసేలా ఈ సినిమా థియేటర్లలో బాగానే సందడి చేస్తోంది.
చాలా విరామం తర్వాత హిందీలో రిలీజైన మాస్ మసాలా సినిమా కావడం.. నార్త్ మార్కెట్ అంతటా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం.. దీపావళి పండుగ టైంలో సినిమా రిలీజ్ కావడంతో సూర్యవంశీ వెండితెరల్లో వెలుగులు నింపుతోంది. ఈ క్రమంలో బాహుబలి-2, ఎవెంజర్స్-ఎండ్ గేమ్ సినిమాల రికార్డులను అది బద్దలు కొట్టింది. పీక్ టైంలో బుక్ మై షోలో సూర్యవంశీ సినిమాకు సంబంధించి సెకనుకు 17 టికెట్లు అమ్ముడయ్యాయట.
ఇప్పటిదాకా ఇండియన్ బాక్సాఫీస్లో ఏ సినిమాకూ ఈ ఫ్రీక్వెన్సీలో టికెట్లు అమ్ముడవ్వలేదట. బాహుబలి-2, ఎవెంజర్స్ సినిమాలకు సంబంధించి సెకనుకు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో తెలియదు కానీ.. వాటిని అధిగమించి సూర్యవంశీ టికెట్ల అమ్మకాల్లో రికార్డు నెలకొల్పినట్లు బుక్ మై షో వాళ్లే స్వయంగా వెల్లడించారు. ఈ గణాంకాల్ని బట్టి సూర్యవంశీ హిందీ ప్రేక్షకుల్లో బాగానే వేడి పుట్టించిందని అర్థమవుతోంది. ఇక మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాకు వసూళ్ల విషయంలో ఢోకా లేదు.
ఇండియాలో తొలి వీకెండ్లోనే ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ అక్షయ్ సినిమా బాగానే సందడి చేస్తోంది. ఇప్పటిదాకా రూ.35 కోట్ల దాకా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును ఈజీగానే అందుకునేలా ఉంది.
This post was last modified on November 11, 2021 7:29 am
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…
ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా…
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్కు గుర్తు తెలియని…
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో నారా భువనేశ్వరి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మ్యూజికల్…