నేచురల్ స్టార్ నాని కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. అతడి నుంచి బహు భాషల్లో రిలీజ్ కానున్న తొలి చిత్రమిది. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కూడా ఇదే. అంతే కాక.. ఓటీటీల్లో విడుదలవడం, నాని స్థాయికి తగని చిత్రాలు కాకపోవడం వల్ల ‘వి’, ‘టక్ జగదీష్’ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేయగా.. ‘శ్యామ్ సింగ రాయ్’పై వారు చాలా ఆశళతో ఉన్నారు. డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
దీన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడదుల చేస్తున్నారు. ఐతే ఇన్ని భాషల్లో రిలీజ్ చేస్తూ హిందీలో ఈ సినిమాను విడుదల చేయకపోవడమేంటో అర్థం కావడం లేదు.
ఇదే మాట నానిని అడిగితే.. “నిజానికి శ్యామ్ సింగరాయ్ చిత్రానికి దేశవ్యాప్తంగా విడుదలయ్యే పరిధి ఉంది. అన్ని భాషల వాళ్లకూ నచ్చే యూనివర్శల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లోనే రిలీజ్ చేస్తున్నాం. హిందీలో రిలీజ్ చేసే ఆలోచన లేదు. అలాగని ఈ కథ హిందీలోకి వెళ్లదని చెప్పలేం. దక్షిణాదిన రిలీజయ్యాక బాలీవుడ్ నిర్మాతలకు ఈ సినిమా నచ్చి రీమేక్ అయ్యే అవకాశాలున్నాయి. ఏమో ఏ హృతిక్ రోషనో, ఇంకో బాలీవుడ్ హీరోనో ఈ సినిమాను రీమేక్ చేస్తారేమో. చూద్దాం” అన్నాడు నాని.
ఇక ‘శ్యామ్ సింగరాయ్’ విశేషాల గురించి నాని మాట్లాడుతూ.. ఇందులో శ్యామ్ సింగరాయ్తో పాటు వాసు అనే మరో పాత్ర కూడా చేశానని.. రెండూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని.. శ్యామ్ సింగరాయ్ పాత్ర తన కెరీర్లోనే ఒక మైలురాయిలా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. కథానాయికలుగా నటించిన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముగ్గురికీ ఇందులో సమాన ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయని.. సినిమా ఆ ముగ్గురికీ మంచి పేరు తీసుకొస్తుందని నాని అన్నాడు.
This post was last modified on November 9, 2021 9:27 pm
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…