నేచురల్ స్టార్ నాని కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. అతడి నుంచి బహు భాషల్లో రిలీజ్ కానున్న తొలి చిత్రమిది. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కూడా ఇదే. అంతే కాక.. ఓటీటీల్లో విడుదలవడం, నాని స్థాయికి తగని చిత్రాలు కాకపోవడం వల్ల ‘వి’, ‘టక్ జగదీష్’ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేయగా.. ‘శ్యామ్ సింగ రాయ్’పై వారు చాలా ఆశళతో ఉన్నారు. డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
దీన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడదుల చేస్తున్నారు. ఐతే ఇన్ని భాషల్లో రిలీజ్ చేస్తూ హిందీలో ఈ సినిమాను విడుదల చేయకపోవడమేంటో అర్థం కావడం లేదు.
ఇదే మాట నానిని అడిగితే.. “నిజానికి శ్యామ్ సింగరాయ్ చిత్రానికి దేశవ్యాప్తంగా విడుదలయ్యే పరిధి ఉంది. అన్ని భాషల వాళ్లకూ నచ్చే యూనివర్శల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కానీ ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లోనే రిలీజ్ చేస్తున్నాం. హిందీలో రిలీజ్ చేసే ఆలోచన లేదు. అలాగని ఈ కథ హిందీలోకి వెళ్లదని చెప్పలేం. దక్షిణాదిన రిలీజయ్యాక బాలీవుడ్ నిర్మాతలకు ఈ సినిమా నచ్చి రీమేక్ అయ్యే అవకాశాలున్నాయి. ఏమో ఏ హృతిక్ రోషనో, ఇంకో బాలీవుడ్ హీరోనో ఈ సినిమాను రీమేక్ చేస్తారేమో. చూద్దాం” అన్నాడు నాని.
ఇక ‘శ్యామ్ సింగరాయ్’ విశేషాల గురించి నాని మాట్లాడుతూ.. ఇందులో శ్యామ్ సింగరాయ్తో పాటు వాసు అనే మరో పాత్ర కూడా చేశానని.. రెండూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని.. శ్యామ్ సింగరాయ్ పాత్ర తన కెరీర్లోనే ఒక మైలురాయిలా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. కథానాయికలుగా నటించిన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముగ్గురికీ ఇందులో సమాన ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయని.. సినిమా ఆ ముగ్గురికీ మంచి పేరు తీసుకొస్తుందని నాని అన్నాడు.
This post was last modified on November 9, 2021 9:27 pm
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…
సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని…