Movie News

శ్యామ్ సింగ రాయ్‌ బాలీవుడ్ ప్లాన్స్

నాని తొలిసారి చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ శ్యామ్ సింగ రాయ్. తన పాత్రలో రెండు రకాల వేరియేషన్లు.. ముగ్గురు హీరోయిన్లు.. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే యాక్షన్ సీన్లతో సినిమాని చాలా స్పెషల్‌గా ప్లాన్ చేశాడు రాహుల్ సాంకృత్యన్. చిత్రాన్ని డిసెంబర్‌‌ 24న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

సాధారణంగా ప్యాన్ ఇండియా సినిమా అంటే హిందీలో కూడా రిలీజవ్వాలి. కానీ దాన్ని వదిలేసి నాలుగు భాషల్లోనే ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే డౌట్ అందరిలోనూ ఉంది. దానికి జవాబు ఇప్పుడు తెలిసింది. ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేసే ప్లాన్స్‌ ఉన్నాయట. అందుకే హిందీలో రిలీజ్ చేసే ఆలోచనను విరమించుకున్నారట. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో నాని కూడా ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయాలని ఉందని, కానీ అక్కడ రీమేక్ చేసే చాన్సెస్ ఉన్నాయని చెప్పడంతో అది నిజమేనని తేలింది.

ఆల్రెడీ బీటౌన్‌లో రీమేక్‌కి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయట. నాని పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. అన్నీ కుదిరితే ఆయనతోనే రీమేక్ చేయొచ్చనే సమాచారం అందుతోంది. ఇప్పటికే నాని నటించిన ‘జెర్సీ’ మూవీని షాహిద్ కపూర్‌‌తో రీమేక్ చేశారు. అతి త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పుడు మరో సినిమా కూడా బాలీవుడ్‌కి వెళ్తోందంటే నాని అందరినీ అలరించే కథలే ఎంచుకుంటున్నాడని అర్థమవుతోంది.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

1 hour ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

2 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago