తన సినిమాలకు సంబంధించి తనకు తానుగా ఏ విశేషాలూ బయట పెట్టడానికి ఇష్టపడడు దర్శక ధీరుడు రాజమౌళి. అలాగే చిత్ర బృందంలోని వాళ్లు కూడా ప్రమోషన్లలో సినిమా సీక్రెట్స్ ఏవీ బయటపెట్టకుండా చూసుకుంటాడు. ‘బాహుబలి’కి సంబంధించి ఓ వేడుకలో ప్రభాస్ ఏదో చెప్పబోతుంటే.. రాజమౌళి కింది నుంచి ‘నో’ అన్నట్లుగా హెచ్చరిక జారీ చేయడం తెలిసిందే. ఆ మధ్య తన తండ్రి ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ పాత్ర గురించి మీడియాతో మాట్లాడితే.. జక్కన్న నొచ్చుకున్నట్లుగా వార్తలు రావడం తెలిసిందే.
అలాంటి రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఒక ముఖ్యమైన డైలాగ్ను ఒక ప్రైవేటు కార్యక్రమంలో తనంతట తానే బయటపెట్టేయడం విశేషం. ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం”.. ఇదీ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ కీలక సన్నివేశంలో వచ్చే డైలాగ్. ఈ మాటను బట్టి సినిమాలో ఒక భారీ యుద్ధం ఉంటుందని.. హీరోలిద్దరూ ధర్మయుద్ధం చేయడం ద్వారా అందులో విజయం సాధిస్తారని అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్లో ఛాయిస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజమౌళి ఈ డైలాగ్ను పంచుకోవడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’కు ఫేమస్ రైటర్ సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. “నిర్మాత శోభు యార్లగడ్డ ద్వారా ఛాయిస్ ఫౌండేషన్ సతీశ్ పరిచయం అయ్యారు. పిల్లల్లో కలిగే 90శాతం సమస్యలకు పరిష్కారాలున్నాయి. ఛాయిస్ ఫౌండేషన్ పిల్లల కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతోంది” అని అన్నాడు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’లోని డైలాగ్ను పంచుకుని అందరినీ అలరించారు. చిన్నారుల కోసం పనిచేస్తున్న ఈ సంస్థకు 2 కోట్ల రూపాయల చెక్ను మాస్ మ్యుచవల్ ఫండ్ తరపున రవి తంగిరాల అందించారు.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…