బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న సినిమా ‘అఖండ’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఇప్పటివరకు ప్రకటించకపోవడానికి ఆంధ్రలో తగ్గించిన టికెట్ రేట్లే కారణమని తెలుస్తోంది. ‘అఖండ’ సినిమా ఆంధ్ర ఏరియా హక్కులు చాలారోజుల క్రితమే అమ్మేశారు. దాదాపు రూ.35 కోట్ల రేషియాలో బేరం కుదిరింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.
టికెట్ రేట్లు పెరుగుతాయేమోనని చూశారు. కానీ అలా జరగడం లేదు. ఇప్పుడు సినిమాను రిలీజ్ చేస్తామని అంటుంటే.. బయ్యర్లేమో బేరాలాడుతున్నారు. ముందు చెప్పిన రేటుకి సినిమాను కొనుక్కుంటే వాళ్లకు వర్కవుట్ అవ్వదని.. కనీసం పాతిక నుంచి ముప్పై శాతం తగ్గించమని అడుగుతున్నారు. అంటే రూ.35 కోట్లకు అమ్మాలనుకున్న ఆంధ్ర హక్కులను రూ.28 కోట్ల రేషియోలో అమ్మాల్సి ఉంటుందన్నమాట.
ఆంధ్ర హక్కుల విషయంలో రాజీ పడితే సీడెడ్ లో కూడా తగ్గించమని అడుగుతారు. అంటే ఎలా లేదన్నా.. పది కోట్లకు పైగా ఆదాయం పోగొట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో నిర్మాత ఒప్పుకోవడం లేదట. అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో.. థియేట్రికల్ హక్కులను తక్కువకి అమ్ముకుంటే తనకు నష్టం వస్తుందని భావిస్తున్నారు. నాన్ థియేట్రికల్ హక్కులు మంచి రేటుకే పలికినప్పటికీ.. థియేటర్ మీద మరో యాభై కోట్లు వస్తేనే నిర్మాత బయటపడగలరు. ఈ విషయంపై బయ్యర్లతో చర్చలు జరుగుతున్నాయి. వాటిపై ఓ క్లారిటీ వస్తే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.
This post was last modified on November 9, 2021 6:54 am
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…