Movie News

‘అఖండ’ నిర్మాత.. అంతకి తగ్గుతాడా..?

బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న సినిమా ‘అఖండ’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఇప్పటివరకు ప్రకటించకపోవడానికి ఆంధ్రలో తగ్గించిన టికెట్ రేట్లే కారణమని తెలుస్తోంది. ‘అఖండ’ సినిమా ఆంధ్ర ఏరియా హక్కులు చాలారోజుల క్రితమే అమ్మేశారు. దాదాపు రూ.35 కోట్ల రేషియాలో బేరం కుదిరింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.

టికెట్ రేట్లు పెరుగుతాయేమోనని చూశారు. కానీ అలా జరగడం లేదు. ఇప్పుడు సినిమాను రిలీజ్ చేస్తామని అంటుంటే.. బయ్యర్లేమో బేరాలాడుతున్నారు. ముందు చెప్పిన రేటుకి సినిమాను కొనుక్కుంటే వాళ్లకు వర్కవుట్ అవ్వదని.. కనీసం పాతిక నుంచి ముప్పై శాతం తగ్గించమని అడుగుతున్నారు. అంటే రూ.35 కోట్లకు అమ్మాలనుకున్న ఆంధ్ర హక్కులను రూ.28 కోట్ల రేషియోలో అమ్మాల్సి ఉంటుందన్నమాట.

ఆంధ్ర హక్కుల విషయంలో రాజీ పడితే సీడెడ్ లో కూడా తగ్గించమని అడుగుతారు. అంటే ఎలా లేదన్నా.. పది కోట్లకు పైగా ఆదాయం పోగొట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో నిర్మాత ఒప్పుకోవడం లేదట. అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో.. థియేట్రికల్ హక్కులను తక్కువకి అమ్ముకుంటే తనకు నష్టం వస్తుందని భావిస్తున్నారు. నాన్ థియేట్రికల్ హక్కులు మంచి రేటుకే పలికినప్పటికీ.. థియేటర్ మీద మరో యాభై కోట్లు వస్తేనే నిర్మాత బయటపడగలరు. ఈ విషయంపై బయ్యర్లతో చర్చలు జరుగుతున్నాయి. వాటిపై ఓ క్లారిటీ వస్తే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.

This post was last modified on November 9, 2021 6:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago